తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

బిఆర్ఎస్ పార్టీతోనే సంక్షేమం అభివృద్ధి…

బిఆర్ఎస్ పార్టీతోనే సంక్షేమం అభివృద్ధి…

  • ప్రభుత్వ విప్   రేగా కాంతారావు 

మణుగూరు, శోధన న్యూస్ : బిఆర్ఎస్ పార్టీతోనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రభుత్వ విప్,   బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, పినపాక  ఎమ్మెల్యే  రేగా కాంతారావు అన్నారు.  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని పూల మార్కెట్ ఏరియా   ప్రభుత్వ విప్  రేగా కాంతారావు  సమక్షంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పట్టణంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ ని వీడి  సుమారు 100 కుటుంబాల వారు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్  ప్రకటించిన మ్యానిఫెస్టోలో కెసిఆర్ బీమా పథకం ప్రతి ఇంటికి ధీమాగా మారబోతున్నదన ఆయన అన్నారు. సీఎం కేసీఆర్  ప్రవేశపెట్టిన పథకాలను ప్రతి ఒక్కరికి తెలియజేయాలన్నారు. మహిళలకు నెల నెల 3 వేలు ఇవ్వడంతో పాటు అన్నపూర్ణ పథకం కిందట రేషన్ షాపు ద్వారా సన్నబియ్యం మహిళా సంఘాలకు మరింత బలోపేతం చేయడం, సౌభాగ్య లక్ష్మీ పథకం మహిళలకు ఎంతో మేలు చేస్తుందన్నారు.  ఆసరా పింఛన్లు రానున్న ఐదేళ్లలో రూ 5 వేలు, దివ్యాంగుల పెన్షన్లు రూ 6వేలకు పెంపు, వ్యవసాయానికి రైతు బంధు పదహారువేలు పెంపు, మహిళలకు గ్యాస్ సిలిండర్ 400కు, ఆరోగ్యశ్రీ 15 లక్షలు పెంపు, ఇండ్ల స్థలాలు లేని పేదలకు స్థలాలు, అగ్రవర్ణ పేదలకు రాష్ట్రంలో 119 రెసిడెన్షియల్ స్కూల్స్ వంటి పథకాలు అన్ని వర్గాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  పినపాక నియోజకవర్గం ఎన్నికలలో మరోసారి ఆశీర్వదించండి మరింత అభివృద్ధి చేస్తానని ఆయన అన్నారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేశానని, మరోసారి అవకాశం కల్పించాలని ప్రజలను కోరారు. సీఎం కేసీఆర్  నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి సాధించింద అన్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *