సీఎం కేసీఆర్ హయాంలోనే సబ్బండ వర్గాలకు న్యాయం- ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
సీఎం కేసీఆర్ హయాంలోనే సబ్బండ వర్గాలకు న్యాయం
-అభివృద్ధికి పట్టం కట్టండి…
-ఎన్నికల ప్రచారంలో భాగంగా రేగాకి బ్రహ్మ రథం పట్టిన ప్రజలు
-కాంగ్రెస్ కి స్కీములను నమ్మి మోసపోవద్దు
– ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
మణుగూరు, శోధన న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం, మున్సిపాలిటీలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామాలలో పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు పూల వర్షంతో రేగాకు ఘన స్వాగతం పలికారు. అదేవిధంగా పలు ఆలయాలలో దేవాలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ.. పనిచేసే వారికి పట్టం కట్టండి పినపాక నియోజకవర్గం లో జరిగిన అభివృద్ధిని చూసి మరోసారి అవకాశం ఇస్తే నియోజకవర్గం మరింత ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని అన్నారు. విద్యుత్, వ్యవసాయం, వైద్య, విద్య రంగాల్లో ఎంతో అభివృద్ధిని సాధించాం అన్నారు. ప్రతి కుటుంబ ఏదో రూపంలో ప్రభుత్వ సహాయం పొందుతున్నాయి, మీరంతా కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. తెలంగాణ రాక ముందు మన బతుకులు ఎట్లా ఉండే తెలంగాణ రాకపోతే మన బతుకులు ఆగమైపోతుండే కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఎన్నో అద్భుత సంక్షేమ పథకాలను అమలు చేస్తూ దేశంలోనే శవంతంగా తీర్చిదిద్దారని అన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో పాలన ఎట్లా ఉందో తెలంగాణ లో ఎట్లుందో ప్రజలు ఆలోచించాలి ఆయన అన్నారు. స్వరాష్ట్రంలో ఊరు వాడల ఎంతో అభివృద్ధి జరిగింది రోడ్లు వేసినం సిసి రోడ్ల నిర్మించిన వాగులపై వంతెనలు నిర్మించడంతోపాటు ప్రజలకు దురాభారం తగ్గింది ఇట్ల ఎన్నో సౌకర్యాలు కల్పించుకున్నామని వివరించారు అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే సంక్షేమ పథకాలు అన్నారు అంటే కారు గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆయన కోరారు. రైతుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృ షి చేస్తున్నారని అన్నారు. రైతు బంధు ఎకరానికి మొదటి ఏడాది 12 వేల నుంచి ఐదు సంవత్సరాల కాలంలో 16 వేలకు పెంచి ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారని ఆయన అన్నారు. రైతు బీమా పథకం ద్వారా లక్ష మందికి పైగా రైతులు లబ్ధి పొందాలని 73 వేల కోట్లు రైతు బంధు పథకం ద్వారా అందిస్తున్నారన్నారు. రాష్ట్రంలో మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి సాధించేందుకు పలు పథకాలను సీఎం కేసీఆర్ గారు ప్రవేశపెట్టారని ఆయన పేర్కొన్నారు. సౌభాగ్య లక్ష్మి పథకంతో పేద మహిళలకు 3000 గౌరవ భృతి ఇచ్చేందుకు మ్యానిఫెస్టో లో పేర్కొన్నారని, దేశంలో ఎక్కడలేని విధంగా మహిళలకు రాజకీయ అవకాశాలు కల్పించాలని గుర్తు చేశారు. స్వయం శక్తి గ్రూపులకు సొంత భవనాలు నిర్మించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకు సీఎం కేసీఆర్ గారు కృషి చేస్తున్నారని రాష్ట్రవ్యాప్తంగా అత్యుధునిక వైద్యశాలలను ఏర్పాటు చేయడంతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశారన్నారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించినందుకు బస్తీ దవాఖానాలు ఏర్పాటుచేసి సౌకర్యాలు కల్పించారని, ఇప్పటివరకు పది లక్షల ఉన్న ఆరోగ్య బీమా గరిష్ట పరిమితిని కేసీఆర్ ఆరోగ్య రక్ష పథకంతో 15 లక్షలకు పెంచి మ్యానిఫెస్టోలో పెట్టారన్నారు. అదేవిధంగా తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి 5 లక్షల జీవిత బీమా కల్పించేందుకు సీఎం కేసీఆర్ చర్యలు తీసుకున్నార అన్నారు,ఆసరా పెన్షన్ తో అర్హులైన వారికి చేతన అందించేందుకు సీఎం కేసీఆర్కృ షి చేస్తున్నారని ఆయన తెలిపారు. రూ 3000 ఉన్న పెన్షన్ ప్రతి సంవత్సరం పెంచుతూ రూ 5000 ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నారన్నారు. అదేవిధంగా దివ్యంగులకు పెన్షన్ ఇటీవల నాలుగు వేలకు పెంచారని అని తెలిపారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రేషన్ పై ఉన్న బియ్యం అందించినందుకు అన్నపూర్ణ పథకం మ్యానిఫెస్టో తో సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని, దీంతో 93 లక్షల పేద కుటుంబాలకు లబ్ధి చేకూరనున్నదన్నారు. అదేవిధంగా 400కే వంట గ్యాస్ అందించేందుకు సీఎం కేసీఆర్ చర్యలు తీసుకున్నారని తెలిపారు. అదే విధంగా అగ్రవర్ణ పేదలకు గురుకులాల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మణుగూరు ఎంపిపి కారం విజయకుమారి, జెడ్పీటీసీ పోశం నరసింహారావు, బిఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.