భద్రాచలంలో గంజాయి పట్టివేత
భద్రాచలంలో గంజాయి పట్టివేత
భద్రాచలం, శోధన న్యూస్: భద్రాచలంలో కోటి 21 లక్షల రూపాయల విలువగల గంజాయిని భద్రాచలం పోలీసులు సోమవారం పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి భద్రాచలం పట్టణ సీఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం భద్రాచలం ఏఎస్పి పారితోష్ పంకజ్ఆదేశాలమేరకు సోమవారం మధ్యాహ్నం ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద పట్టణ యస్ఐ విజయ లక్ష్మి తన సిబ్బందితో వాహనాలు తనిఖీ చేస్తుండగా హర్యానా కు చెందిన మున్షిరం, బగత, గోవింద్ లు డబ్బులు జల్సా లకు అతిగా ఖర్చు చేసుకొని, సరిపోకపోవడం వల్ల గంజాయి వ్యాపారం చేయాలని ఆలోచన వచ్చి, వీరు బల్వన్ అనే వ్యక్తి ప్రోద్బలం తో ఒక ఆటో ని కొనుగోలు చేసి దేవుని ప్రచార రథం ల తయారు చేసి భక్తుల వేషం ధరించి ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులలోనీ కలిమెల పరిసర ప్రాంతాలలో బుజ్జి అనే వ్యక్తీ వద్ద గంజాయి కొనుగోలు చేసి హర్యానా లో చిన్న చిన్న ప్యాకెట్లు చేసి అవసరమైన వ్యక్తుల కు అమ్ముటకు అక్రమంగా తరలిస్తుండగా, ముగ్గురిని పట్టుకోవడం జరిగిందన్నారు . ఇట్టి పట్టుబడిన ముగ్గురు నిందితుల వద్ద నుండి 484 కిలోల గంజాయి ఒక ఆటో, రెండు సెల్ ఫోనులను స్వాధీనం చేసుకోవడం జరిగింది వీటి విలువ ఒక కోటి 21 లక్షలు ఉన్నట్లు గుర్తించాం అన్నారు , ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకోని కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ నాగరాజు తెలిపారు.