వి ఆర్ కె పురంలో చేయూత స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
చేయూత స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
ములుగు, శోధన న్యూస్: ములుగు జిల్లా వెంకటాపురం మండలం వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ పరిధిలోని గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు చిడెం సాయి ప్రకాష్ఆ ధ్వర్యంలో రక్తహీనత వ్యాధితో బాధపడుతున్న పిల్లలు కొరకు ఆదివారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంకటాపురం సబ్ ఇన్స్ పెక్టర్ ఆఫ్ పోలీస్ అశోక్ హాజరై రక్తదానం చేసిన సుమారు 20 మంది యువకులకు సర్టిఫికెట్లను ఎస్ఐ అశోక్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం మండల సర్పంచ్ సంఘం అధ్యక్షురాలు, వి ఆర్ కె పురం సర్పంచ్ పూనెం శ్రీదేవి, బి ఆర్ ఎస్ మండల అధికార ప్రతినిధి డర్ర దామోదర్, యూత్ రాంప్రసాద్, నాగేశ్వరరావు, దినేష్, సతీష్, నాని, రవి, శ్రీను, నరేందర్, గుండమ్మల మధు, గ్రామపంచాయతీ సిబ్బంది వెంకటేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.