తెలుగు మహాసభల ను జయప్రదం చేయండి
తెలుగు మహాసభల ను జయప్రదం చేయండి
ఇల్లందు, శోధన న్యూస్ : రెండవ అంతర్జాతీయ తెలుగు మహాసభలు 2024 జనవరి 5, 6,7 తేదీలలో గోదావరి ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ కళాశాల ప్రాంగణంలో రాజమహేంద్రవరం (రాజమండ్రి)తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ లో నిర్వహిస్తున్న సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం వికాస వేదిక ఆధ్వర్యంలో కవులు పాల్గొనాలని నిర్వాహకులు కోరారు, వేలాదిమంది తెలుగు భాష విమానులతో తెలుగు భాషలోని 25 సాహిత్య ప్రక్రియలు సకటాలతో ఆంధ్రమేవ జయతే వైభవ శోభయాత్ర యువ అవధానితో అవగాహన ప్రదర్శన సంచారజాతుల కళా ప్రదర్శనలు ఉంటాయని కవులు,కళాకారులు ,జిల్లా ,రచయితలు అంతర్జాతీయ తెలుగు మహాసభలను జయప్రదం చేయాలని మహాసభల బ్రోచర్ను సింగరేణి పాఠశాల ప్రధానోపాధ్యాయులు తిప్పర్తి వెంకటేశ్వర్లు ఆవిష్కరిస్తూ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వికాస వేదిక అధ్యక్షులు ఆంగోత్ జయవాసు ,కవులు శ్రీమతి జోష్ణ బట్టు వీరన్న , వెంకట్ నరసయ్య,హిమాంశిక,సీనియర్ ఉపాధ్యాయులు పీవీ నర్ససమ్మ, మేరీ పాల్గొన్నారు.