సైబర్ క్రైమ్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించిన పోలీసులు
సైబర్ క్రైమ్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించిన పోలీసులు
హన్మకొండ ,శోధన న్యూస్: ఎల్కతుర్తి మండలం లోని దామెర గ్రామంలో శనివారం స్థానిక ఎస్సై గోదారి రాజకుమార్ పై అధికారుల ఆదేశాల మేరకు దామెర గ్రామంలోని ప్రజలందరికీ సైబర్ క్రైమ్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాజ్ కుమార్ మాట్లాడుతూ. సైబర్ క్రైమ్ నేరాల పట్ల ప్రజలు విద్యార్థులు యువత పూర్తి అవగాహన ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు తమ వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలు అపరిచితులతో పంచుకోవద్దని సూచించారు. ఫోన్లలో ఓటీపీ, ఓఎల్ఎక్స్, పేటీఎం, గూగుల్పే, ఫోన్పే, కేవైసీలను అప్డేట్ చేయమని వచ్చే మెసేజ్లకు స్పందించకూడదన్నారు. సైబర్ నేరాలకు గురైనప్పుడు 1930 ట్రోల్ఫ్రీ నంబర్కు డయల్ చేయాలన్నారు.
స్థానిక పోలీస్ స్టేషన్ వచ్చి ఫిర్యాదు చేయవలసిందిగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎస్సై రాజకుమార్ కానిస్టేబుల్ బక్కయ్య సోమేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు