తెలంగాణమహబూబాబాద్

ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో పోలింగ్ అధికారుల పాత్ర కీలకం

ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో పోలింగ్ అధికారుల పాత్ర కీలకం

మహబూబాబాద్ ,శోధన న్యూస్: ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో పోలింగ్ అధికారుల పాత్ర కీలకం అని మహబూబాబాద్  జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులు చేయవలసిన విధులపై మాస్టర్ ట్రైనర్స్ చే నిర్వహించిన 2 వ రోజు శిక్షణా కార్యక్రమంలో జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ పాల్గొని వారికి పిపిటి ద్వారా శిక్షణా తరగతుల గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఓటింగ్ ప్రారంభం లో తీసుకోవలసిన జాగ్రత్తలు మాక్ పోలింగ్ నిర్వహించే విధానం లో జాగ్రత్తలు తీసుకోవాలని అలాగే సంభందిత పోలింగ్ అధికారులు ఫామ్ 22 ను క్లుప్తంగా ఒకటికి 10 సార్లు చదివి తప్పులు లేకుండా సరిచూసుకోవాలని అన్నారు ట్రైనింగ్ పొందే అధికారులు సందేహం ఉన్నట్లయితే వారికి మరొకసారి అవగాహన కల్పిస్తామని జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *