తెలంగాణవరంగల్

బయోమైనింగ్ ప్రక్రియ పరిశీలన.

బయోమైనింగ్ ప్రక్రియ పూర్తి చేయాలి 

వరంగల్ ,శోధన న్యూస్ : నిర్దేశిత గడువులో బయోమైనింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని బల్దియా కమీషనర్ అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాంపూర్ డంపింగ్ యార్డు యందు క్షేత్ర స్థాయి లో పర్యటించి కొనసాగుతున్న బయోమైనింగ్ ప్రక్రియను కమీషనర్ పరిశీలించారు. ఈ సందర్భం గా కమీషనర్ మాట్లాడుతూ.. జూన్ మాసాంతానికి బయోమైనింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని, 3 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను ప్రాసెసింగ్ చేయాల్సి ఉండగా ఇప్పటివరకు లక్ష 87 వేల మెట్రిక్ టన్నుల చెత్త ప్రాసేసింగ్ మాత్రమే పూర్తి చేయడం జరిగిందని, ప్రతిరోజు 2 మెట్రిక్ టన్నుల చొప్పున లక్ష్యాన్ని నిర్దేశించుకుని ప్రణాళిక బద్ధం గా వ్యవహరిస్తూ గడువులోగా పూర్తి చేయాలని, ప్రతిరోజు పూర్తి చేసిన చెత్త ప్రాసెసింగ్ సంబంధిత సమాచారాన్ని అందజేయాలని, బల్దియా వ్యాప్తంగా ఉన్న 66 డివిజన్ ల నుండి చెత్తను సేకరించి డంప్ యార్డ్ కు తరలించే క్రమం లో రోడ్డు పైన చెత్త పడకుండా వుండేలా వాహనాల పైన కవర్లను ఏర్పాటు చేసేలా చూడాలని ముఖ్య ఆరోగ్యాధి కారిణి ఆదేశించారు. ప్రశాంత్ నగర్ లో 15 ఎం ఎల్ డి సామర్థ్యం తో నిర్వహించబడుతున్న సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్ టి పి) ను కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి, ట్రీట్మెంట్ పనితీరు విధానాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు,ఈ సందర్భం గా అధికారులు కమీషనర్ కు ప్లాంట్ పనితీరును వివరిస్తూ ప్రతి రోజూ 5 ఎం ఎల్ డి మురికి నీటిని శుద్ధికరిస్తున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *