ఆదర్శ పాఠశాల పురోగతి పనులు, పోలింగ్ స్టేషన్లను తనిఖీ
ఆదర్శ పాఠశాల పురోగతి పనులు, పోలింగ్ స్టేషన్లను తనిఖీ
పినపాక నియోజకవర్గం, శోధన న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మణుగూరు, పినపాక మండలాల్లో అమ్మ ఆదర్శ పాఠశాల పనులు, పార్లమెంటు ఎన్నికల నిర్వహణ లో భాగంగా ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్లలో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాండురంగాపురం ఎంపియుపిఎస్ లో జరుగుతున్న అమ్మ ఆదర్శ పాఠశాల పనులను, పోలింగ్ కేంద్రాలను పరిశీలించి అక్కడ మంచినీటి కోసం నిర్మిస్తున్న సంపును పాఠశాలకు దూరంగా కాకుండా దగ్గరగా నిర్మించాలని, పాఠశాలలో పనులన్నీ వారంలో రోజుల్లోగా పూర్తిచేయాలని ఏ ఏ పీ ఎస్ చైర్మన్, మండల అసిస్టెంట్ ఇంజనీర్ ను ఆదేశించారు. పాఠశాలల్లో ఏడవ తరగతి వరకు కేవలం 38 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారని, రాబోయే విద్యా సంవత్సరంలో బడి ఈడు పిల్లలందరినీ పాఠశాలలో చేరేటట్లు తగిన చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. అనంతరం పాండురంగాపురంలో మహిళలతో వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొంతమంది మహిళలు అక్కడ 10 ఇళ్లకు నెలరోజులుగా నీళ్లు రావడంలేదని కలెక్టర్ కు తెలిపారు. కలెక్టర్ ఎంపీడీవో , ఆర్డబ్ల్యూఎస్ ఏఈ నీ రెండు రోజుల్లో పైప్ లైన్ వేసి సమస్య పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ సుందరయ్య నగర్ గొత్తి కోయల ఆవాసములను సందర్శించి తాగునీటి సదుపాయాలు పాఠశాల వసతులు, వారి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. సుందరయ్య నగర్ అంగన్వాడి పాఠశాలలో టీచర్ పోస్ట్ ఖాళీగా ఉందని గుర్తించిన జిల్లా కలెక్టర్ మూడు రోజుల్లో డిప్యూటేషన్ పై వేరొక టీచర్ ను నియమించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పాత గుంపులో నీళ్లు రావడం లేదు అని తెలుపగా వెంటనే చేతి పంపు లేదా ట్యాంకర్ ద్వారా నీటి సదుపాయాన్ని కల్పించాలని ఎంపీడీవో, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ ని ఆదేశించారు.సుందరయ్య నగర్ గ్రామస్తులు వారి ఆవాసము నుండి అకినేపల్లి మల్లారం వరకు రోడ్డు కావాలని కలెక్టర్ ను అడగగా ప్రస్తుతం ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున ఎటువంటి నూతన పనులు చేపట్టకూడదని, ఎన్నికల పూర్తి అయిన అనంతరం రోడ్డు నిర్మాణం చేపడతామని కలెక్టర్ తెలిపారు. జడ్పీహెచ్ఎస్ జానంపేట లో జరుగుతున్న అమ్మ ఆదర్శ పాఠశాల పనులు, ఎన్నికలు నిర్వహించే బడే రూములను తనిఖీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎన్నికల నిర్వహించబడే రూములో ఏవైనా చిన్న చిన్న రిపేర్లు ఉన్నచో వెంటనే పూర్తి చేసి ప్రతి రూమ్ లో నాలుగు లైట్లు, నాలుగు ఫ్యాన్లు ఉండే విధంగా ఏర్పాటు చేయాలని, పనులన్నీ వారం రెండు రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
మణుగూరు మండలంలో పార్లమెంటు ఎన్నికల నిర్వహణలో భాగంగా జడ్పీహెచ్ఎస్ మణుగూరు నందు ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూమ్ పరిసరాలు, పోలింగ్ స్టేషన్లు ఏర్పాట్లు సక్రమంగా ఉన్నాయా లేదా అని తనిఖీ చేసి, ఓకే ఆవరణంలో స్ట్రాంగ్ రూమ్, పోలింగ్ కేంద్రాలు, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్లు ఉన్నందున తగిన విధంగా భారీ కేడింగ్ చేయవలసిందిగా తాసిల్దార్ సూర్యనారాయణ ఆదేశించారు. తాగునీటి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆర్డబ్ల్యూఎస్ సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు.