పూర్తైన రెండవ దశ ర్యాండమైజేషన్
పూర్తైన రెండవ దశ ర్యాండమైజేషన్
-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎన్నికల అధికారి ప్రియాంక అలా
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగే పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు పోలింగ్ సిబ్బంది రెండవ దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేసామని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ప్రియాంక అలా తెలిపారు. శుక్రవారం ఐడిఓసి వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరం లో ఎన్నికల ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ రామ్ కుమార్ గోపాల్ తో కలిసి ఎన్ఐసి వారు రూపొందించిన సాఫ్ట్ వేర్ వినియోగిస్తూ ఆన్లైన్ లో పోలింగ్ సిబ్బంది రెండవ దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ప్రియాంక అలా మాట్లాడుతూ జిల్లాలో కొత్తగూడెం , ఇల్లందు, పినపాక, భద్రాచలం, అశ్వరావుపేట అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 962 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, తొమ్మిది ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్లు ప్రపోజల్ నిమిత్తం రాష్ట్ర ఎన్నికల అధికారికి పంపడం జరిగిందన్నారు. రెండవ ర్యాండమైజేషన్ ప్రక్రియలో భాగంగా 1162 ప్రిసైడింగ్ అధికారులు, 1162 సహాయక ప్రిసైడింగ్ అధికారులు, 2324 ఓపిఓలు ను కేటాయించడం జరుగుతుందన్నారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు ప్రకారం అదనంగా సిబ్బంది కేటాయింపు ప్రక్రియ చేపట్టామని తెలిపారు.