తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

అంతర్ రాష్ట్ర చెక్ పోస్టులను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ  

అంతర్ రాష్ట్ర చెక్ పోస్టులను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ  

భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ : రాబోయే పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల నియమావళి ప్రకారం అంతరాష్ట్ర,  అంతర్ జిల్లా చెక్ పోస్టులను  మంగళవారం జిల్లా ఎస్పీ డాక్టర్ రోహిత్ రాజు  తనిఖీలు చేశారు.అక్రమంగా నగదు మద్యం మరియు మాదకద్రవ్యాల రవాణాను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ  తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలను నిర్వహించేందుకు జిల్లాలో అన్ని రకాల భద్రతా ఏర్పాట్లను చేయడం జరిగిందన్నారు. జిల్లాలో 12 అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టులను, 04 అంతర్ జిల్లా సరిహద్దు చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ చెక్ పోస్టుల ద్వారా ,  జిల్లా పోలీసులు చేపట్టిన వివిధ తనిఖీలలో జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు రూ 1,19,50,531 ల నగదును, రూ.16,37,324ల విలువ గల 2502 లీటర్ల మద్యాన్ని, రూ.2,06,85,300 విలువ గల 828 కేజిల గంజాయిని, రూ11,22,000ల   విలువ చేసే బంగారు, వెండి వస్తువులను స్వాదీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుండి మొత్తం రూ.3,53,95,155  లను స్వాదీనం చేసుకున్నట్లు  తెలిపారు. అలాగే  పెనగడప, దమ్మపేట మండలం మందలపల్లి, అల్లిపల్లి,అశ్వారావుపేటలో ఏర్పాటు చేసిన అంతర్ రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టులను సందర్శించి అక్కడ విధులలో ఉన్న అధికారులు, సిబ్బందికి తగు సూచనలు చేశారు. అనంతరం అశ్వరావుపేటలో గల అగ్రికల్చర్ యూనివర్సిటీ లో  ఏర్పాటుచేసిన ఈవీఎంల స్ట్రాంగ్ రూము వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *