తెలంగాణభద్రాద్రి కొత్తగూడెంమణుగూరు

 మేముసైతం మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ ఆర్ధిక సహాయం

 మేముసైతం మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ ఆర్ధిక సహాయం

మణుగూరు, శోధన న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మున్సిపాలిటీ హరిజనవాడ ప్రాంతానికి చెందిన…..
బి సుదర్శన్(50) అనారోగ్యంతో మరణించారు. నిరుపేద కుటుంబం కావడంతో దహన సంస్కారాలకు ఆర్ధిక ఇబ్బందులు పడుతుంది. ఈ విషయం తెలుసుకున్న మణుగూరు మేముసైతం మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు శుక్రవారం వారి గృహానికి వెళ్ళి మృతదేహాన్ని సందర్శించి నివాళ్ళు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం దహన సంస్కారాల నిమిత్తం ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ.3వేలను ట్రస్ట్ సభ్యులు మృతుని కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మేము సైతం మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ కోశాధికారి రంగా శ్రీనివాసరావు, కార్యక్రమాల నిర్వాహక ఇంచార్జ్ చిందుకూరి ఏడుకొండలు, ఆంబులెన్స్ డ్రైవర్ ప్రదీప్,.గ్రామపెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *