ఎస్సైలను ఘనంగా సత్కరించిన ఎస్పీ రోహిత్
ఎస్సైలను ఘనంగా సత్కరించిన ఎస్పీ రోహిత్
పోలీస్ శాఖలో విధులు నిర్వర్తిస్తూ పదవీ విరమణ పొందిన ఎస్సైలు ఖాజా నసీరుద్దీన్ , శ్రీనివాసరావు ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తన కార్యాలయంలో ఘనంగా సత్కరించారు.
కొత్తగూడెం 3టౌన్ పోలీస్ స్టేషన్ నందు ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న ఖాజా నజీరుద్దీన్జిల్లా షీ టీం నందు ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న శ్రీనివాసరావు ఈ రోజుతో పోలీసు శాఖలో తమ సర్వీస్ ను ముగించుకొని పదవీ విరమణ పొందడం జరిగింది.
గత 40 సంవత్సరాలుగా క్రమశిక్షణతో పోలీస్ శాఖలో పనిచేస్తూ ప్రజలకు సేవలు అందించిన ఈ ఇద్దరు అధికారులను ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించారు.పదవీ విరమణ అనంతరం ప్రభుత్వం నుంచి వారికి చెందాల్సిన అన్ని రకాల ప్రతిఫలాలను త్వరితగతిన అందేలా చర్యలు చేపట్టాలని జిల్లా పోలీస్ కార్యాలయ అధికారులకు సూచించారు,
పదవీ విరమణ పొందిన పోలీసు అధికారుల కుటుంబ సభ్యులకు వివరాలను అడిగి తెలుసుకున్నారు.తమ శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడపాలని తెలిపారు.భవిష్యత్తులో ఏ విధమైన సహాయం కావాలన్నా వెంటనే తమను సంప్రదించాలని వారికి తెలియజేశారు.పదవీ విరమణ పొందిన ఇద్దరు అధికారులు పోలీసు శాఖలో తమ అనుభవాలను ఎస్పీ తో పంచుకున్నారు.అనంతరం జిల్లా పోలీసు శాఖలో వారు అందించిన సేవలకు గాను ఎస్పీ గారు వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు.