తెలంగాణభద్రాద్రి కొత్తగూడెంమణుగూరు

ఐటిఐలో మూడవ విడత ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి 

ఐటిఐలో మూడవ విడత ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి 
మణుగూరు, శోధన న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేటు ఐటీఐ లలో మూడవ విడత ప్రవేశాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని  మణుగూరు ఐటిఐ ప్రిన్సిపాల్ జిల్లా కన్వీనర్ బడుగు ప్రభాకర్ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… ఈనెల 2 నుంచి 12 వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. మణుగూరు ప్రభుత్వ ఐటిఐ లోని ఎలక్ట్రిషన్, ఫిట్టర్, డ్రాఫ్ట్ మెన్ సివిల్, డీజిల్ మెకానిక్ ,కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (కోప ) కోర్సు లలో సీట్లు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు మొదటి రెండవ విడతల్లో దరఖాస్తు చేసి సీట్ రానివారు ఆన్లైన్లో ఆప్షన్ పెట్టుకోవాల్సిందిగా తెలిపారు. ఇప్పటివరకు దరఖాస్తు చేయనివారు కొత్తగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. అర్హత ఆసక్తి కలిగిన విద్యార్థులు ఈనెల 12లోగా సమీపంలోని ప్రభుత్వ ఐటిఐ లో దరఖాస్తులు ఆన్లైన్ చేసుకోవడానికి ప్రత్యేక సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. www. ititelangana. gov.in అనే వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చును. ఇటీవల సప్లమెంటరీలో పదవ తరగతి పాస్ అయిన వారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మొదటి విడత దరఖాస్తు చేసుకొని సీటు రానివారు ఆప్షన్ పెట్టుకోవాలి అని తెలిపారు. పూర్తి వివరాల కోసం 9440206990కు ఫోన్ చేసి తెలుసుకోవాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *