లొంగిపోయిన దళ, మిలీషియా సభ్యులకు రివార్డులు.
లొంగిపోయిన దళ, మిలీషియా సభ్యులకు రివార్డులు.
కాలం చెల్లిన నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలు నచ్చక,మావోయిస్టు పార్టీ అగ్రనాయకుల వేధింపులు తట్టుకోలేక ఇటీవల కాలంలో జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయిన నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు దళసభ్యులతో పాటు మరో ఏడుగురు మిలీషియా మరియు కమిటీ సభ్యులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు చెక్కుల రూపంలో రివార్డ్ నగదును అందజేశారు.
లొంగిపోయిన వారికి ప్రభుత్వం తరఫున అందవలసిన అన్ని రకాల ప్రతిఫలాలను అందించి,వారు మెరుగైన జీవితాన్ని గడిపే విధంగా కృషిచేయడంలో జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ముందుంటుందని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ తెలిపారు.అభివృద్ధి నిరోధకులుగా మారిన నిషేధిత సిపిఐ మావోయిస్టులు కేవలం తమ ఉనికి కోసమే అమాయకులైన ఆదివాసి ప్రజలకు మాయమాటలు చెప్పి బలవంతంగా పార్టీలోకి చేర్చుకుని వారి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేస్తున్నారని అన్నారు.లొంగిపోయి సాధారణ జీవితం గలపాలనుకునే మావోయిస్టు పార్టీకి చెందిన సభ్యులు తమ బంధుమిత్రుల ద్వారా గాని,దగ్గర్లోని పోలీస్ స్టేషన్లో గాని, పోలీసు అధికారుల వద్ద గానీ నేరుగా లొంగిపోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.