KhammamTelangana

శివ తేజ్ ,లక్ష్మి తేజస్వి లా  మానవత్వం.

శివ తేజ్ ,లక్ష్మి తేజస్వి లా  మానవత్వం.

ఖమ్మం లోని  శ్రీ చైతన్య పాఠశాల, మామిల్లగూడెం బ్రాంచ్ లో  మున్నేరు వరద బాధితులకు 5వ తరగతి విద్యార్థుల సహాయం అందచేశారు. కాలసాని దుర్గా ప్రసాద్ , అరుణ లా పిల్లలు శివ తేజ్ మరియు లక్ష్మి తేజస్వి నులు వరద బాధితులకు విరాళం అందచేశారు. ఈ సందర్భంగా శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం వారు మాట్లాడుతూ.. కరుణ, సామాజిక బాధ్యతా గుణాలు ప్రదర్శిస్తూ, శ్రీ చైతన్య స్కూల్, మామిల్లగూడెం బ్రాంచ్‌కు చెందిన 5వ తరగతి విద్యార్థులు శివ తేజ్ మరియు లక్ష్మి తేజస్విని, వారి స్వంత పొదుపు నిధి నుండి రూ 3,300 మున్నేరు వరద బాధితులకు విరాళంగా ఇచ్చారు.విద్యార్థుల ఈ స్ఫూర్తిదాయక కృషిని పాఠశాల యాజమాన్యం కొనియాడింది. వారి దయ , సామాజిక బాధ్యత యొక్క ఉదాహరణగా ప్రశంసించారు.

శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులను సమాజానికి ప్రయోజనకరంగా పాల్గొనేలా ప్రోత్సహిస్తూ, కరుణ, సామాజిక బాధ్యత , సేవ అనే విలువలను పెంపొందించేందుకు ఎల్లప్పుడూ అంకితభావంతో ఉంటుందని యాజమాన్యం తెలిపారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *