Badradrikothagudem

చదువులతో పాటు క్రీడల పట్ల ఆసక్తి చూపాలి.

విద్యార్థులు చదువులతో పాటు క్రీడల పట్ల ఆసక్తి చూపాలి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్  పాల్వంచ పట్టణం శ్రీనివాస కాలనీలోని మినీ క్రీడా ప్రాంగణంలో నిర్వహిస్తున్న క్రీడాపోటీలను తిలకించి విద్యార్థులను అభినందించారు.ఈ సందర్భంగా  జిల్లా కలెక్టర్ జితేష్ మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొని జిల్లా, రాష్ట్రస్థాయిలో ఉత్తమంగా ప్రతిభ కనబరచాలన్నారు.ఆ దిశగా విద్యార్థులను వారి తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. నేటితరం విద్యార్థులు సెల్ఫోన్లు, యూట్యూబ్లో నిమగ్నమై వారి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని, అలా కాకుండా ఆసక్తితో చదువుతూనే, అటు ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొంటే వారిలో మానసిక వికాసంతో పాటు దేహదారుఢ్యం వికసిస్తుందని తెలిపారు.క్రీడల ద్వారా భవిష్యత్తు యువతరం ఆరోగ్యవంతంగా, ఉత్సాహంగా తమ లక్ష్యంలో రాణించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎస్ఓ పరంధామ రెడ్డి, డిసిఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, డాక్టర్ యుగంధర్ రెడ్డి, అన్నం వెంకటేశ్వర్లు, విజయబాబు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *