118 కేజీల గంజాయి పట్టివేత
118 కేజీల గంజాయి పట్టివేత.
• రెండు ఆటోలు స్వాధీనం..
• ఇద్దరు వ్యక్తుల అరెస్ట్.. పరారీ లో ఒకరు.
ఒరిస్సా కలిమెల నుంచి హైదరాబాద్ కు ఆటోలో అక్రమంగా తరలి వెళ్తున్న గంజాయిని బుధవారం ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ఒరిస్సా కలిమెళ్ళ నుంచి హైదరాబాద్ కు రెండు ఆటోలో గంజాయి వెళుతుందని సమాచారం మేరకు, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ ఎక్సైజ్ పోలీసులు కలిసి ఆర్టీవో చెక్పోస్ట్ వద్ద తనిఖీలు చేపట్టారు.
అనుమానంగా వచ్చినటువంటి రెండు ఆటల్లో తనిఖీలు నిర్వహించగా అందులో గంజాయి ఉన్నట్లు గుర్తించారు. గంజాయిని వేయగా 118 కేజీలుగా ఉన్నట్లు ఎక్సైజ్ పోలీసులు నిర్ధారించారు.గంజాయి తో పాటు రెండు ఆటో లను ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. మరో వ్యక్తి పరారయ్యాడని ఎక్సైజ్ పోలీసులు తెలిపారు.
పట్టుకున్న గంజాయి, వాహనాల విలువ కలిపి రూ. 31.50 లక్షలు గా ఉంటుందని ఎక్సైజ్ సూపర్ డెంట్ కరమ్ చందు తెలిపారు.అరెస్టు కాబడిన వ్యక్తుల్లో హైదరాబాద్ కు చెందిన కనిగల స్వాతిక్, మణుగూరు కు చెందిన గుంజు ఆమోస్ ను అరెస్టు చేయగా,సపా వత్ వెంకన్న పరారీ లో ఉన్నట్లు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు.
ఈ తనిఖీల్లో ఎస్.ఐ గౌతమ్ సిబ్బంది రామకృష్ణ గౌడ్, హాబీబ్ పాషా, వెంకట నారాయణ, గురవయ్య, సుమంత్, శ్రావణి, రమేష్ పాల్గొన్నారు.