Uncategorized

దీపావళి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలి

దీపావళి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలి: జిల్లా కలెక్టర్ జితేష్

జిల్లాలోని ప్రజలందరూ ఆనందోత్సాహాల మధ్య దీపావళి పండుగను జరుపుకోవాలని ఈ పండగ ప్రజల జీవితాల్లో మంచిని తీసుకురావడంతో పాటు వారి జీవితాల్లో వెలుగులు నింపాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆకాంక్షించారు.
గురువారం దీపావళి పండగను పురస్కరించుకొని జిల్లా లోని ప్రజలకు కలెక్టర్ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. దీపావళి పండగ అంటే దుష్టశక్తులపై ధైవశక్తి సాధించిన విజయానికి ప్రతీకగా పండగను జరుపుతామని… అలాగే దీపావళి రోజున లక్ష్మీ, సరస్వతీ పూజలు చేసి ప్రతి ఒక్కరు ఆనందోత్సాహాలతో ఉంటారన్నారు. బాణసంచా విషయంలో పిల్లల పట్ల పెద్దలు అప్రమత్తంగా ఉండాలన్నారు, ప్రజలు తమ తమ రంగాలలో మరింత ఉత్సాహంతో విజయాలు సాధించాలని, జిల్లా అభివృద్ధి కి తోడ్పడాలని కలెక్టర్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *