Telangana

 కోట్ల విలువ గంజాయి దహనం

 కోట్ల విలువ గంజాయి దహనం

భద్రాచలం ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్ లో నిల్వగల 1186 కేజీల గంజాయిని దగ్ధం చేశారు. రూ.3 కోట్ల విలువ చేసే 1186 కిలోల గంజాయిని సోమవారం దహనం చేశారు. భద్రాచలం ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఐదు కేసుల్లో పట్టుబడిన గంజాయిని AWs కన్సటింగ్‌ లిమిటెడ్‌ గోపాల్ పేట్ తల్లెడ మండలంలోని దహన కేంద్రంలో గంజాయిని దగ్ధం చేయించారు.

ఖమ్మం డిప్యూటి కమిషనర్‌ జనార్థన్‌రెడ్డి, అసిస్టేంట్‌ కమిషనర్‌ గణేష్‌, భద్రాది కొత్తగూడెం ఎక్సైజ్‌ సూపరిండెంట్‌ జనాయ్య, భద్రాచలం ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్‌ సీఐ రహీమ్‌ ఉన్నీషా బేగం సమక్షంలో గంజాయిని దగ్ధం చేయించారు. గంజాయిని దగ్ధం చేయించిన ఖమ్మం జి ల్లా ఎక్సైజ్‌ పోలీసులను ఎక్సైజ్‌ ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టర్‌ వి.బి. కమలాసన్‌రెడ్డి అభినందించారు.

 

భద్రాచలం ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఐదు కేసుల్లో పట్టుబడిన గంజాయిని AWs కన్సటింగ్‌ లిమిటెడ్‌ గోపాల్ పేట్ తల్లెడ మండలంలోని దహన కేంద్రంలో గంజాయిని దగ్ధం చేయించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *