Badradrikothagudem

జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని విజయవంతం చేయాలి

జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని విజయవంతం చేయాలి.

జిల్లా కలెక్టర్ జితేష్

జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో ఈ నెల 11వ తేదీన నిర్వహించనున్న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం రోజున 1 నుండి 19 సంవత్సరాల వయసు గల వారందరికీ నులిపురుగులను నివారించే ఆల్బెండజోల్ మాత్రలను అందించాలన్నారు.

ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ మరియు గిరిజన ఆశ్రమ పాఠశాలలు మరియు వసతి గృహాలలో ప్రతి విద్యార్థులకు మాత్రలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ మాత్రల ద్వారా పిల్లల్లో రక్తహీనత, బుద్ధిమధ్యం, చదువుల పట్ల ఏకాగ్రత పెంపొందుతుందన్నారు.

విద్యాశాఖ, ఏఎన్ఎం, అంగన్వాడీలు సమన్వయంగా పనిచేసే ఈ ఒక్కరిని విడిచిపెట్టకుండా మాత్రలను అందివ్వాలి అన్నారు. ప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు, అంగన్వాడి పిల్లలకు మాత్రలు అందించాలన్నారు. అంగన్వాడి టీచర్లకు శిక్షణ ఇచ్చి వయసుల వారీగా మాత్రల డోస్ ఇవ్వాలన్నారు. భోజనం తర్వాతనే ఆల్బెండజోల్ మాత్రలు వేయించాలన్నారు. పాత్రలు వేసే ప్రదేశంలో తగినంత త్రాగునీరు అందుబాటులో ఉంచుకోవాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *