గిరిజన మహిళా డిగ్రీ కళాశాలను సందర్శించిన కలెక్టర్
గిరిజన మహిళా డిగ్రీ కళాశాలను సందర్శించిన కలెక్టర్ జితేష్
కొత్తగూడెం నెహ్రు నగర్ లో గల గిరిజన సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలను జిల్లా కలెక్టర్ జితేష్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన గురుకుల వసతి గృహంలో సౌకర్యాలు సమస్యలను విద్యార్థినీలను అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నారా లేదా అని ఆరా తీశారు.
నిబంధనల ప్రకారం విద్యార్థులకు దించాల్సిన ఆహారం, విద్యా సామాగ్రి ఇతర సౌకర్యాల గురించి అక్కడ విద్యార్థులను అడిగి తెలుసుకుంటూ వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కళాశాల ప్రిన్సిపల్ అనురాధను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థినిలకు కావలసిన మెరుగైన వసతులు గురించి అడిగి తెలుసుకున్నారు. రాబోయే న్యాక్ (NAAC) అక్రిడేషన్ కోసం మరియు విద్యార్థులు ఉన్నత భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా నిర్మించుకోవాలి అని విద్యార్థులకు మరియు సిబ్బందికు తగు సూచనలు చేశారు.
విద్యార్థినులు ఏవైన సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామన్నారు. బాగా చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.