Praveen : ప్రవీణ్ కుమార్ యొక్క ప్రాముఖ్యత
ప్రవీణ్ కుమార్ యొక్క ప్రాముఖ్యత.
భద్రాద్రి పవర్ ప్లాంట్లో జే పి ఎ గా విధులు నిర్వహాస్తూ (క్రికెట్, ఫుట్ బాల్ హాకీ తదితర ఆటలలో పాల్గొని ప్రతిభ కనబర్చిన .ప్రవీన్ కుమార్ అనారోగ్యం చేత డిసెంబర్-2023 సంవత్సరం లో చనిపోయినారు. వీరితో పాటు ఆటతో పాల్గొన్న బిటిపిఎస్ కి సహక్రీడాకారులు , తోటి ఉద్యోగులు ఆర్ధిక సహాయాన్ని చీఫ్ ఇంజనీర్ బిచ్చన్న చేతుల మీదుగా 35,000/- చెక్ ను వారి కుటుంలు సభ్యులకు అందచేయడం జరిగింది.
ఈ కార్యక్రమాన్ని ఉదేశించి సి ఈ మాట్లాడుతూ ప్రవీణ్ కుమార్ యొక్క ప్రాముఖ్యత ను కొనియాడారు.వారి కుటుంబానికి సంస్థ అండగా వుంటుదని తెలియ పర్చారు. ఈ కార్యక్రమంతో పార్వతి , మురళీకృష్ణ , సత్యనారాయణ స్పోర్ట్స్ సెక్రెటురీ కల్తీ నరసింహారావు, ప్రవీన్ కుటుంబ సభ్యులు, క్రీడ్రాకారులు నాగేశ్వరరావు, సత్యనారాయణ, రామ్మోహన్, హేమమూర్తి,అశోక్ రెడ్డి , గోపి, ప్రేమ్ ప్రకాశ్, రమేష్, వెంకట్, తిరుపతి, సంపత్ రెడ్డి , వెంకట్, ప్రవీష్, నవీన్ ,రాయసాబ్ , సాయి ప్రసాద్, ఆరిఫ్ పాషా తదితరులు పాల్గొన్నారు.