Badradrikothagudem

సాయి ఎక్సలెంట్ పాఠశాలలో నవోదయ ప్రవేశ పరీక్ష శిక్షణ

సాయి ఎక్సలెంట్ పాఠశాలలో నవోదయ ప్రవేశ పరీక్ష శిక్షణ

ప్రభుత్వం ప్రవేశపెట్టిన అత్యంత ప్రతిష్టాత్మకమైన నవోదయ ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్ విడుదల అయిందని. జూలూరుపాడు సాయి ఎక్సలెంట్ పాఠశాల కరస్పాండెంట్ కృష్ణ ప్రసాద్ తెలిపారు.

ఈ సందర్భంగా 2024-25 సంవత్సరంలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులకు నవోదయ ప్రవేశ పరీక్ష శిక్షణ కోసం జూలూరుపాడు మండల కేంద్రంలోని సాయి ఎక్సలెంట్ పాఠశాలలో అత్యంత అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో తక్కువ సమయంలో శిక్షణ ఇవ్వబడుతుందని తెలిపారు. అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని, జూలై 18 నుండి తరగతులు ప్రారంభం అవుతాయన్నారు.

ఈ ప్రవేశ పరీక్షలో సీట్లు సాధించిన వారికి కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించనున్నట్టు తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9441700094, 9440296832 సంప్రదించాలని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *