BadradrikothagudemHealthTelangana

సింథటిక్ టెన్నిస్ కోర్టు ప్రారంభించిన పొంగులేటి

సింథటిక్ టెన్నిస్ కోర్టు ప్రారంభించిన పొంగులేటి

పాల్వంచ మండలంలో సుమారు 50 లక్షల వ్యయంతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన సింథటిక్ టెన్నిస్ కోర్టును రాష్ట్ర రెవెన్యూ,హౌసింగ్, సమాచార మరియు పౌర సంబంధాలు శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ టెన్నిస్ కోర్టులో 70 నుంచి 80 మంది నిత్యం శిక్షణ పొందేలా రూపొందించారు. ఈ సందర్భంగా మంత్రి క్రీడాకారులతో కలసి టెన్నిస్ ఆడారు. ఖేలో ఇండియా లో భాగంగా ఆర్చరీ శిక్షణ శిబిరాన్ని సందర్శించారు. క్రీడాకారులతో మాట్లాడుతూ శారీరక దృఢత్వానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. క్రీడలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని, క్రీడాకారులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. అనంతరం క్రీడా ప్రాంగణంలోమొక్కను నాటారు.

జిల్లా ఐ డి ఓ సి కార్యాలయ ఆవరణలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ( మెప్మా) ద్వారా గ్రూప్ యాక్టివిటీ కింద ఓం సాయిరాం మహిళా సంఘం, వినాయక పేద ప్రాంత సమాఖ్య భరతమాత పట్టణ సమాఖ్య కొత్తగూడెం మున్సిపాలిటీ వారు 6,00,000 రూపాయల బ్యాంకు రుణ సహాయంతో ఏర్పాటుచేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ను మంత్రి ప్రారంభించారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేయడంతో పాటు వారికి ఋణ సదుపాయాలు అందించి వివిద ఆదాయాబివృద్ది కార్యక్రమం చేపట్టుటకు ప్రణాళికలను సిద్దం చేయడం జరిగింది అని అన్నారు.

మహిళా సాదికారతను సాధించుటకు రాబోయే 5 సంవత్సరాలలో చిరు వ్యాపారాలను ప్రోత్సహిస్తూ సంఘ సభ్యులకు నైపుణ్యం పనిలో శిక్షణ ప్యాకింగ్ మరియు బ్రాండింగ్, మార్కెటింగ్ కల్పించడం పుడ్ ప్రోససింగ్ యూనిట్స్ ను నెలకొల్పడం మిని ఇండస్ట్రీయల్ పార్క్, వడ్డీ రుణాలు, లోన్స్, మరియు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు ఏర్పాటు చేయుట ద్వారా విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం జరుగుతుందని అన్నారు.గ్రామీణ మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనే ఉద్దేశంతో వారికి కావాల్సిన ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందిస్తోందన్నారు. అక్క చెల్లెమ్మలందరు ఆర్థికంగా అభివృద్ధి పరచడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అన్నారు.కొత్తగూడెం లో మొత్తం 5 ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు.

 కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో మొదటి క్యాంటీన్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వివిధ రకాల ఆహార పదార్ధాలతో క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మహిళా శక్తి క్యాంటీన్‌లలో ఆహారం అమ్మ చేతి వంటలా ఉండాలన్నారు. నాణ్యతకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *