ముసాయిదా బిల్లుపై సలహాలు సూచనలు
ముసాయిదా బిల్లుపై సలహాలు సూచనలు.
ప్రభుత్వం ప్రవేశపెడుతున్న నూతన ఆర్ఓఆర్ చట్టం ముసాయిదా బిల్లుపై సలహాలు సూచనలు అందజేయాలని కలెక్టర్ జితేష్ కోరారు.
ఐ డి ఓ సి లోని సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులు, న్యాయవాదులు, రైతులు, యువకులు, పాత్రికేయలు, నిపుణులతో వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగాజిల్లా కలెక్టర్ జితేష్ మాట్లాడుతూ ..భూ సమస్యల పరిష్కారానికి నూతన రెవెన్యూ చట్టం రూపొందించాలని ప్రభుత్వం సంకల్పించిందని, దీనిలో భాగంగానే నూతన రెవెన్యూ చట్టం 20 24 ముసాయిదా బిల్లు రూపొందించిందని కలెక్టర్ చెప్పారు .
నూతన చట్టం రూపకల్పనలో రైతులను, ప్రజలను మేధావులను భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వర్క్ షాప్ లో నిర్వహించాలని ఆదేశించిందని కలెక్టర్ తెలిపారు. బిల్లు అంశాలు,రైతుల భూ రికార్డులు పకడ్బందీగా ఉండాలని ఉద్దేశంతో ముసాయిదా బిల్లుపై మేధావులు విద్యావేత్తలు, రెవెన్యూ అధికారులు, రిటైర్డ్ అధికారులు, భద్రాద్రి కొత్తగూడెం బార్ అసోసియేషన్ సభ్యులు, రైతులు, రైతు సంఘం నాయకులు, తమ సూచనలు అందజేయాలని కలెక్టర్ కోరారు. రైతులు మాట్లాడుతూ.. చట్ట మార్పు చేసేటప్పుడు భూ సర్వే నిర్వహించాలని, భూమిపై ఉన్న రైతులు మాత్రమే నమోదు చేయాలని తెలిపారు. గ్రామస్థాయి రెవెన్యూ వ్యవస్థ ఉండాలని, పాత చట్టాలను మార్చి, కొత్త చట్టాలలో ప్రతి సంవత్సరం పహానీలలో నమోదు ఉండాలని, శిస్తు వసూలు మళ్లీ పెట్టాలని, కాస్త కాలం ఉండాలని,ఆర్వోఆర్ ను సవరించాలన్నారు.
పొజిషన్ కాలం ఉండాలని కబ్జా ఉన్న రైతులకే పట్టా ఇవ్వాలని, ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి కొత్త చట్టం గురించి తెలపాలని, గ్రామాల వారిగా ఉన్న సర్వే నెంబర్లలో భూమి ఎక్కువగా ఉంటుందని సరిచేయాలని, భూమి అమ్మిన వారి పేర్లను తొలగించాలని, ధరణి పోర్టల్ వల్ల రైతులకు చాలా నష్టం జరిగిందని దాన్ని తీసేయాలని, ఈ చట్టం ద్వారా గతంలో జరిగిన తప్పులు మళ్ళీ జరగకూడదని, భూములను మ్యాపింగ్ చేయాలని, రైతుబంధు తీసుకుంటున్న రైతుల భూములను పరిశీలించాలన్నారు.ఆధార్ నమోదు తో పాటు మరేదైనా కార్డు కంపల్సరిగా తీసుకోవాలన్నారు.
కొత్త చట్టంలో అప్పిల్ ఉండాలని, పొజిషన్ కాలం కూడా ఉండాలని, ప్రభుత్వం చట్టంపై రైతుల అభిప్రాయాలు తీసుకొని చట్టం చేయడం చాలా సంతోషంగా ఉందని, సాదా బైనామా చేసే అధికారం డివిజన్ అధికారులకు ఇవ్వాలని, గిఫ్ట్ రిజిస్ట్రేషన్ లో సర్టిఫికెట్స్ అన్ని అప్లోడ్ చేయాలని, జమాబందీ జరగాలని, ఏ రైతు అప్పిలైన జిల్లా లెవల్లో అయిపోవాలని, గ్రామాల వారీగా రికార్డులు చేపట్టాలని, భూ సమస్యల అప్పిలేటదారిటీ జిల్లా స్థాయిలో ఉండేలా చూడాలని, ప్రతి గ్రామంలో రెవెన్యూ ఉద్యోగి నియమించాలని వారు కోరారు.