Badradrikothagudem

ఆరోగ్యాల పట్ల జాగ్రత్తలు వహించాలి

పోలీస్ అధికారులు మరియు సిబ్బంది తమ ఆరోగ్యాల పట్ల జాగ్రత్తలు వహించాలి: ఎస్పీ రోహిత్ రాజు

ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారి సహకారంతో సబ్ డివిజన్లో పనిచేసే పోలీసు అధికారులు మరియు సిబ్బందికి ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కొత్తగూడెం పట్టణంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ బిల్డింగ్ నందు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

ఈసిజీ,గైనకాలజీ,బీపి,షుగర్,దంత సమస్యలు,కళ్ళ పరీక్షలు,ఆర్థోపెడిక్,యురాలాజీ,ఫిజియోతెరపి,గుండె సంభంధిత పరీక్షలు మరియు రక్త పరీక్షలు చేసే విధంగా ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు కొత్తగూడెం డిఎస్పి రెహమాన్ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ పోలీస్ శాఖలో భర్తీ అయినప్పుడు కఠినమైన శిక్షణతో,పూర్తి శారీరక సామర్థ్యంతో,ఆరోగ్యంగా శిక్షణా కేంద్రాల నుండి ప్రజలకు సేవలు అందించడానికి బయటకు రావడం జరుగుతుందన్నారు.

ఆ తర్వాత విధులలో చేరినప్పటి నుండి నిత్యం శాంతి భద్రతల పరిరక్షణతో పాటు,ప్రజలకు సేవలందిస్తూ పోలీసులు విశ్రాంతి లేని జీవితాన్ని గడపాల్సి వస్తుంది అన్నారు.చాలా సందర్భాల్లో నిద్రాహారాలు మాని విధులు నిర్వర్తించాల్సి వస్తుందని,అందుమూలంగా పోలీసు అధికారులు మరియు సిబ్బంది యొక్క ఆరోగ్యాలపై తీవ్ర ప్రభావం పడుతుందని అన్నారు.పోలీసులు అప్పుడప్పుడు కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితి సరిగా లేనప్పుడు కూడా తప్పనిసరిగా విధులు నిర్వర్తించాల్సి వస్తుందని అన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *