అంగరంగ వైభవంగా బోనాల ఉత్సవాలు
అంగరంగ వైభవంగా బోనాల ఉత్సవాలు
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు సతీమణి నందిని మల్లు ప్రజాభవన్ లో నల్ల పోచమ్మ అమ్మవారికి నిర్వహించిన బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి.
బోనాల ఉత్సవాల్లో పాల్గొనడానికి ప్రజాభవాన్ కి విచ్చేసిన సీఎం రేవంత్ రెడ్డికి, రాష్ట్ర మంత్రులకు భట్టి విక్రమార్క దంపతులు వేద పండితులతో కలిసి ఘనంగా స్వాగతం పలికారు.
ఈ బోనాల ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, విశిష్ఠ అతిథులుగా రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ దుద్దిళ్ల శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ సలహాదారు వేంరెడ్డి నరేందర్ రెడ్డి లు హాజరయ్యారు.