karakagudem

ఎమ్మెల్సీగా ఏనుగుల రాకేశ్‌రెడ్డిని గెలిపించండి

ఎమ్మెల్సీగా ఏనుగుల రాకేశ్‌రెడ్డిని గెలిపించండి.
బీఆర్‌ఎస్‌ శ్రేణుల గ్రామాల్లో విస్తృత ప్రచారం.

కరకగూడెం,శోధన న్యూస్ :వరంగల్-ఖమ్మం-నల్గోండగ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీగా ఏనుగుల రాకేశ్‌రెడ్డిని గెలిపించాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రావుల సోమయ్య అన్నారు.శుక్రవారం కరకగూడెం మండలంలోని గొల్లగూడెం,కొత్తగూడెం,చొప్పాల గ్రామాల్లో గ్రాడ్యుయేట్‌ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించారు.బ్యాలెట్ నమూనాలో సీరియల్-3 రాకేశ్‌రెడ్డికి మొదటి ప్రాధాన్యం ఓటు వేసి గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అక్కిరెడ్డి వెంకట్ రెడ్డి,మాజీ సర్పంచ్ పాయం నర్సింహారావు,మండల యూత్ ప్రెసిడెంట్ గుడ్ల రంజిత్,పార్టీ నాయకులు జివ్వాజి సమ్మయ్య,కుంజ లక్ష్మయ్య,సుతారి నాగేష్,బట్టా బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *