ఖమ్మంహైదరాబాద్

రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు – మంత్రి జగదీష్ రెడ్డి

రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు
– మంత్రి జగదీష్ రెడ్డి
హైదరాబాద్, శోధన న్యూస్:తెలంగాణకు దసరా ఒక ప్రత్యేకమైన వేడుక అన్నారు. సూర్యాపేట శాసనసభ్యులు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, రాష్ట్ర ప్రజలకుదసరా శుభాకాంక్షలు తెలిపారు.ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకునే వరకు విశ్రమించకూడదు అనే స్ఫూర్తితో చెడు మీద మంచి సాధించిన విజయానికి సంకేతంగా విజయదశమి జరుపుకుంటామని పేర్కొన్నారు.దసరా రోజున శుభసూచకంగా పాలపిట్టను దర్శించి పవిత్రమైన జమ్మిచెట్టుకు పూజలు చేసే సాంప్రదాయం గొప్పదని పేర్కొన్నారు. జమ్మి ఆకును బంగారంలా భావించి పంచుకొంటూ,పెద్దల ఆశీర్వాదాలను అందుకుంటూ, అలయ్ బలయ్ తీసుకొంటూ ప్రేమాభిమానాలను చాటుకోవడం దసరా పండుగ ప్రత్యేకత అని మంత్రి తెలిపారు. సిఎం కేసిఆర్ నాయకత్వంలో అనతికాలంలోనే అభివృద్ధిని సాధించి రాష్ట్రాన్ని ముందంజలో నిలిపిన తెలంగాణ పాలన, దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు.విజయానికి సంకేతమైన దసరా నాడు తలపెట్టిన కార్యాలన్నీ ఫలించాలన్నారు. విజయ దశమి స్ఫూర్తిని కొనసాగిస్తామని తెలిపారు. ఆయురారోగ్యాలు,సిరిసంపదలతో జీవించేలా తెలంగాణ ప్రజలను దీవించాలని కనకదుర్గమ్మ అమ్మవారిని మంత్రి జగదీష్ రెడ్డి ప్రార్థించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *