జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించిన కలెక్టర్ గౌతమ్
జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించిన కలెక్టర్ గౌతమ్
ఖమ్మం,శోధన న్యూస్:మహాత్మా జ్యోతిబా పూలే 198వ జయంతిని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ ఘనంగా నివాళులర్పించారు.కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జ్యోతిబాపులే చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా జ్యోతిరావు పూలే అందించిన సేవలను, ముఖ్యంగా మహిళల విద్యాభివృద్ధి కోసం అనితరసాధ్యమైన రీతిలో కొనసాగించిన కృషిని గుర్తు చేసుకున్నారు.పూలే జయంతి కార్యక్రమంలో ఖమ్మం ఆర్డిఓ జి గణేష్, దుర్గాప్రసాద్, క్యాంప్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.