kothagudem

పదవీ విరమణ పొందిన  పోలీసు అధికారులను సత్కరించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు 

పదవీ విరమణ పొందిన  పోలీసు అధికారులను సత్కరించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు 

పోలీస్ శాఖలో విధులు నిర్వర్తిస్తూ పదవీ విరమణ పొందిన ఎస్ఐ రామకృష్ణ, ఏఎస్సై సదయ్య,హెడ్ కానిస్టేబుల్ రామన్న లను  జిల్లా ఎస్పీ రోహిత్ రాజు  తన కార్యాలయంలో ఘనంగా సత్కరించారు.స్పెషల్ బ్రాంచ్ నందు ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న రామకృష్ణ,డీసిఆర్బీ నందు ఏఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న సద్దయ్య మరియు కొత్తగూడెం డిఎస్పీ కార్యాలయం నందు రైటర్ గా పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ రామన్న లా ఈ రోజుతో తమ సర్వీస్ ను ముగించుకొని పదవీ విరమణ పొందడం జరిగింది.గత 40 సంవత్సరాలుగా క్రమశిక్షణతో పోలీస్ శాఖలో పనిచేస్తూ ప్రజలకు సేవలు అందించిన ఈ ముగ్గురు అధికారులను ఎస్పీ  ప్రత్యేకంగా అభినందించారు.పదవీ విరమణ అనంతరం ప్రభుత్వం నుంచి వారికి చెందాల్సిన అన్ని రకాల ప్రతిఫలాలను త్వరితగతిన అందేలా చర్యలు చేపట్టాలని జిల్లా పోలీస్ కార్యాలయ అధికారులకు సూచించారు.అనంతరం పదవీ విరమణ పొందిన పోలీసు అధికారుల కుటుంబాల ప్రస్తుత స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు.తమ శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడపాలని తెలిపారు.భవిష్యత్తులో ఏ విధమైన సహాయం కావాలన్నా వెంటనే తమను సంప్రదించాలని వారికి తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్బి ఇన్స్పెక్టర్ నాగరాజు,వెల్ఫేర్ ఆర్ఐ కృష్ణారావు,జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు శ్రీనివాసరావు,సభ్యులు శ్రీనివాసరావు, జానీ,సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *