kothagudem

 మావోయిస్టుల దుశ్చర్యల వలన ఇబ్బందులకు గురవుతున్న సామాన్య ప్రజలు

 మావోయిస్టుల దుశ్చర్యల వలన ఇబ్బందులకు గురవుతున్న సామాన్య ప్రజలు

తెలంగాణ-చత్తీస్గడ్ రాష్ట్రాల సరిహద్దు ఏజెన్సీ ప్రాంతాల్లో భద్రతా బలగాలను హతమార్చడమే లక్ష్యంగా చేసుకుని ఆదీవాసీలు సంచరించే ప్రదేశాల్లో అమర్చిన బూబీ ట్రాప్స్ ను  పోలీసులు స్వాదీనం చేసుకున్నారు.

4396 పదునైన ఇనుప కడ్డీలను తొలగించారు.

చర్ల మండలంలోని పూసుగుప్ప అటవీ ప్రాంతం మరియు తెలంగాణ-చత్తీస్గడ్ రాష్ట్రాల సరిహద్దుగా గల ప్రాంతాలలో చర్ల పోలీసుల ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం స్పెషల్ పార్టీ,చతీస్ఘడ్ పోలీసులు మరియు CRPF పోలీసులు  సంయుక్తంగా నిర్వహించిన ఏరియా డామినేషన్ ఆపరేషన్లో పోలీసులను హతమార్చడమే లక్ష్యంగా చేసుకొని నిషేధిత సిపిఐ మావోయిస్టులు సరిహద్దు ప్రాంతాల్లోని ఆదివాసీలు మరియు వారికి సంభందించిన జంతువులు సంచరించే ప్రదేశాలలో అమర్చిన 70 బూబీ ట్రాప్స్ ను గుర్తించారు.మావోయిస్టులు గుంతలు త్రవ్వి ఏర్పాటు చేసిన 70 బూబీ ట్రాప్స్ నుంచి 4396 పదునైన ఇనుప కడ్డీలను తొలగించి వాటిని స్వాదీనం చేసుకున్నారు.

ఆదివాసీలు,జంతువులు సంచరించే ప్రాంతాలలో వారు అమర్చిన IEDs.

నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ నాయకులు ఆదివాసీలకు మంచి చేస్తున్నామని చెబుతూ వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లిలా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడటం దురదృష్టకరమని అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ టి.సాయి మనోహర్ మరియు భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్  సంయుక్తంగా ఒక ప్రకటనను విడుదల చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ-ఛత్తీస్గడ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో నివసించే అమాయకపు ఆదీవాసీ ప్రజలు మావోయిస్టుల దుశ్చర్యల వలన నిత్యం బిక్కు బిక్కు మంటూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు.ఆదివాసీలు,జంతువులు సంచరించే ప్రాంతాలలో వారు అమర్చిన IEDs,బూబీ ట్రాప్స్ వలన ఇప్పటికే చాలామంది ప్రాణాలను కోల్పోవడం,తీవ్రంగా గాయాలపాలవ్వడం జరుగుతుందని అన్నారు.కావున సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ఆదివాసి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఇటీవల ములుగు జిల్లా వెంకటాపురం ఏరియాలోని జగన్నాధపురం గ్రామానికి చెందిన యేసు అనే వ్యక్తి మావోయిస్టులు అమర్చిన మండుపాతర పేలి మరణించడం కూడా జరిగిందని తెలిపారు.ఆదివాసిల కోసమే మా పోరాటం అంటూ నీతులు వల్లించే మావోయిస్టు నాయకులు వ్యవసాయ రీత్యా,అటవీ ఉత్పత్తుల సేకరణలో భాగంగా సంచరించే ఆదివాసీలకు తీవ్ర నష్టం కలిగేలా చేస్తున్నారన్నారు.సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ఆదివాసి ప్రజలకు జరిగే నష్టానికి పూర్తి బాధ్యత మావోయిస్టు పార్టీ వహించాలని అన్నారు.

ఆదివాసి ప్రజల సంక్షేమం,అభివృద్ధి

తెలంగాణ-ఛత్తీస్గడ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ఆదివాసి ప్రజల సంక్షేమం,అభివృద్ధి కొరకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు  సారథ్యంలో జిల్లా పోలీసులు ఎల్లప్పుడూ ముందుంటారని తెలియజేసారు.అభివృద్ధి నిరోధకులుగా మారిన నిషేధిత మావోయిస్టులకు ఎవ్వరూ సహకరించవద్దని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *