సమస్యలను తెలుసుకోవడానికి పల్లె యాత్ర
సమస్యలను తెలుసుకోవడానికి పల్లె యాత్ర
మణుగూరు మండలం లోని గ్రామ పంచాయతీ పరిదిలలో నివసించే ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి సామాజిక కార్యకర్త, ప్రముఖ లయర్ కర్నె రవి పల్లె యాత్ర మొదలుపెట్టి వివిధ పంచాయతీల్లో ప్రజల సమస్యలను తెలుసుకొని మణుగూరు మండలం పరిషత్ కార్యాలయంలో MPDO కి పలు సమస్యలను పరిష్కరించాల్సిందిగా దరఖాస్తు అందజేశాము అని తెలిపారు.
ముత్యాలమ్మ నగర్ పంచాయతీ పరిధిలో సంతోష్ నగర్ ప్రాథమిక పాఠశాల మరియు అంగన్వాడి కేంద్రాలు చెరువులను తలపిస్తున్నాయి అని, చిన్న పిల్లలు అంగన్వాడి కేంద్రానికి వెళ్లడానికి చాలా ఇబ్బంది పడుతున్నారని వెంటనే అంగన్వాడి కేంద్రానికి తగిన రహదారి కల్పించాలని సామాజిక కార్యకర్త కర్నె రవి పేర్కొన్నారు.
అదే విధంగా గత ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెత్తా మురికి కాలువ లో చెరి దోమలు ఈగలు నిల్వా ఉండి రోగాలు వచ్చే అవకాశం ఉంది బ్లీచింగ్ పౌడర్ దోమలు ముందు పిచికారి చేయాలి అని సామాజిక కార్యకర్త కర్నె రవి తెలిపారు. మల్లె పల్లి సింగరేణి భూ నిర్వాసితులకు కరెంటు లైన్ లేవపోవడం తో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు అని వెంటనే అక్కడి ప్రజలకు అవసరాలకు తగ్గట్లు కరెంటు లైన్స్ ఏర్పాటు చేయాలని, మణుగూరు TG TW U RJC గర్ల్స్ మణుగూరు పాఠశాలకు వెళ్లడానికి సరైనటువంటి రహదారి మార్గం లేకపోవడంతో,వీధిలైట్లు లేకపోవడంతోరాత్రి సమయాలలో పాములు స్కూల్ లోకి ప్రవేస్తున్నాయి అని విద్యార్థులు బయపడుతున్నారు అని సామాజిక కార్యక్త కర్నె రవి ఈ సమస్యలను వెంటనే వెంటనే పరిష్కరించాలని కోరుతూ దరఖాస్తు చేశామన్నారు.