నా సర్ పాషా కి ప్రతిష్ఠాత్మక సేవా రత్న జాతీయ అవార్డు.
నా సర్ పాషా కి ప్రతిష్ఠాత్మక సేవా రత్న జాతీయ అవార్డు .
మణుగూరు ఏరియా సింగరేణి సేవా సమితి సభ్యులు ప్రముఖ సామాజిక సేవకులు, కార్మిక నాయకులు యస్ డి నా సర్ పాషా కి బహుజన సాహిత్య అకాడమీ (బి.ఎస్.ఏ) జాతీయ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణనాయకత్వంలో రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక “సేవా రత్న నేషనల్ అవార్డు” ప్రకటించారు.
హైదరాబాద్ నాచారంలో గల బి ఎస్ ఏ కార్యాలయంలో సంస్థ జాతీయ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణ గారు ఇతర కమిటీ సభ్యుల చేతుల మీదుగా ఆహ్వాన పత్రాన్ని నాసర్ పాషాకి ఆయన కుటుంబ సభ్యుల సమక్షంలో అందజేశారు. ఈ సందర్భంగా నల్లా రాధాకృష్ణ గారు మాట్లాడుతూ ఎస్ సి ,ఎస్ టి, బీసీ మరియు మైనార్టీల సాహిత్యాన్ని ముందుకు తీసుకు వెళ్ళటం కోసం బహుజన సాహిత్య అకాడమీ వారు ప్రతి ఏటా ప్రజా నిజమకారులకు సంఘ సేవకులకు రచయితలకు కవులకు మరియు స్వచ్ఛంద సంస్థలకు ఈ అవార్డును అందజేస్తున్నట్లు తెలిపారు.
సెప్టెంబర్ 5వ తేదీన ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిలో నిర్వహించే బహుజన రైటర్స్ 8వ సౌత్ ఇండియా కాన్ఫరెన్స్ సందర్భంగా సేవారత్న నేషనల్ అవార్డును అందజేనోట్లు తెలిపారు సౌత్ ఇండియాలోని ఆరు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ,తమిళనాడు, కేరళ, కర్ణాటక, మరియు పుదుచ్చేరి రాష్ట్రాల నుండి సుమారు ఆరు వందల మంది ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరవుతారని రాధాకృష్ణ తెలిపారు.