ఎన్నికల విధుల్లో అలసత్వాన్ని ప్రదర్శిస్తే సహించేది లేదు
ఎన్నికల విధుల్లో అలసత్వాన్ని ప్రదర్శిస్తే సహించేది లేదు
సత్తుపల్లి, శోధన న్యూస్ : ఎన్నికల విధుల్లో అలసత్వాన్ని ప్రదర్శిస్తే సహించేది లేదని ఎన్నికల పరిశీలకులు సత్యేంద్ర సింగ్, జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ హెచ్చరించారు . స్థానిక జ్యోతి నిలయం పాఠశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమును వారు గురువారం పరిశీలించారు. అదేవిధంగా ఈవీఎం, వివి పాట్ ల అనుసంధానాన్ని గమనించారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో కార్యకలాపాలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏర్పాట్లు వివరాలను స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ విధానాన్ని పరిశీలించి పట్టణంలోని పలు పోలింగ్ కేంద్రాలను కూడా వారు సందర్శించారు. ఈ కార్యక్రమంలో రిటర్నింగ్ అధికారి అశోక్ చక్రవర్తి, ఏసీపీ రామాంజనేయులు, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ యోగేశ్వరరావు, కమిషనర్ సుజాత, ఆర్.ఐ నరేష్ తదితరులు పాల్గొన్నారు.