తెలంగాణ

రంగారెడ్డి అకాల మరణం బాధాకరం

రంగారెడ్డి అకాల మరణం బాధాకరం

రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్

సూర్యాపేట, శోధన న్యూస్ : రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ సభ్యులు యాస రంగారెడ్డి అకాల మరణం బాధాకరమని సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. శనివారం కాసరబాద్ కు చెందిన యాస రంగారెడ్డి గుండెపోటుతో మృతి చెందడంతో ఆయన పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ లో రంగారెడ్డి కీలకపాత్ర పోషించారని గుర్తు చేశారు. కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అండగా ఉంటుందని తెలిపారు. ఇటీవలే రంగారెడ్డి కుమారుడు కూడా మరణించడంతో కుటుంబం శోకసంద్రంలో వుండగానే రంగారెడ్డి కూడా మరణించడం అత్యంత బాధాకరమన్నారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ గౌరవ సలహాదారులు దేవత్ కిషన్ నాయక్, జిల్లా కోశాధికారి పాల సైదులు, ఖమ్మంపాటి అంజయ్య గౌడ్ ,అఖిల్ అహ్మద్, కమలాకర్ తదితరులున్నారు.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *