అంతర్జాతీయ విపణిలో శివ్ నారాయణ్ జ్యువెలర్స్
అంతర్జాతీయ విపణిలో శివ్ నారాయణ్ జ్యువెలర్స్
హైదరాబాద్, శోధన న్యూస్: ఇటీవల లండన్ జరిగిన ప్రత్యేక ప్రివ్యూతో శివ్ నారాయణ్ జ్యువెలర్స్ అంతర్జాతీయ విపణిలో అరంగేట్రం చేసింది. ఈ విషయమై శివ్ నారాయణ్ జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ తుషార్ అగర్వాల్ మాట్లాడుతూ శివ్ నారాయణ్ జ్యువెలర్స్ కేవలం ఆభరణాలు మాత్రమే కాదన్నారు.అభిరుచి, చరిత్ర,తరతరాలుగా సాగే కలల కథ అని వ్యాఖ్యానించారు. లండన్ లోని ది వాలెస్ కలెక్షన్ ప్రముఖ హాల్స్ లో ఏర్పాటు చేసిన తమ ప్రదర్శన దాతృత్వానికి చిరునామా,వ్యాపారవేత్త,గ్లోబల్ ఐకాన్, గ్లామరస్ suధా రెడ్డి హోస్ట్ చేసిన భారతదేశ గొప్ప వారసత్వం,శిల్పకళకు గుర్తుగా నిలిచిందన్నారు. మాల్టా మాజీ ప్రధాన మంత్రి జోసెఫ్ మస్కట్, ఫస్ట్ డిప్యూటీ పార్లమెంటు సభ్యురాలు అలెగ్జాండ్రా సాషా, యుగోస్లేవియా ప్రిన్సెస్ కటారినా,మఫతాల్ లగ్జరీ ప్రెసిడెంట్ శీతల్ మఫతాల్,ఫ్రెడ్డీ టోయ్ ఛైర్మన్,డైరెక్టర్ టోయ్ కో, రాయల్ వారెంట్ గ్యారెంటీ హాజరై తమ ఐకానిక్ జ్యువెలరీ వీక్షించారు అన్నారు.