తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

అంతర్ రాష్ట్ర చెక్ పోస్టులను తనిఖీ చేసిన ఎస్పీ వినీత్

 అంతర్ రాష్ట్ర చెక్ పోస్టులను తనిఖీ చేసిన ఎస్పీ వినీత్

భారీ స్థాయిలో నగదు, గంజాయి, నల్లబెల్లం పట్టివేత.

భద్రాద్రి కొత్తగూడెం ,శోధన న్యూస్: సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఎన్నికల నియమావళి ప్రకారం అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టుల వద్ద ముమ్మరంగా  భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ డా వినీత్ తనిఖీలు చేశారు.తెలంగాణ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఎన్నికల నియమావళి ప్రకారం అంతరాష్ట్ర మరియు అంతర్ జిల్లా చెక్పోస్టులను ఏర్పాటు చేసి తనిఖీలను చేపట్టడం జరుగుతుందని  వెల్లడించారు.అక్రమంగా నగదు మద్యం మరియు మాదకద్రవ్యాల రవాణాను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు.ప్రశాంత వాతావరణంలో ఎన్నికలను నిర్వహించేందుకు జిల్లాలో అన్ని రకాల భద్రతా ఏర్పాట్లను చేసినట్లు తెలిపారు.జిల్లాలో 12 అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టులను,10 అంతర్ జిల్లా సరిహద్దు చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేసారు.ఈ పది రోజులలో చేపట్టిన తనిఖీలలో జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 1,24,55,800 రూపాయల నగదును, రూ.25,00,000 ల విలువ గల గంజాయి,రూ.1,77,900 విలువ గల అక్రమ బెల్లం ను స్వాదీనం చేసుకోవడం జరిగిందని వివరించారు. జులూరుపాడు,భద్రాచలం,బూర్గంపాడు,అశ్వారావుపేటలో ఏర్పాటు చేసిన సరిహద్దు చెక్ పోస్టులను సందర్శించి అక్కడ విధులలో ఉన్న అధికారులు,సిబ్బందికి తగు సూచనలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *