అన్నం పరబ్రహ్మ స్వరూపం
అన్నం పరబ్రహ్మ స్వరూపం
మధిర,శోధన న్యూస్ : అన్ని దానాల కంటే అన్నదానం మిన్న అని, అన్నం పరబ్రహ్మ స్వరూపం అని ఆర్యవైశ్య సంఘం నాయకులు కపిలవాయి జగన్ తూములూరి ఉపేందర్ అన్నారు. శనివారం వర్తక సంఘం వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద దాతలు ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేసిన అన్నదానాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదవాడి ఆకలి తీర్చే విధంగా ప్రతి శనివారం వర్తక సంఘం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద దాతల సహకారంతో అన్నదానం ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమంలో పాల్గొనాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఆడంబరాలకు మితిమీరి ఖర్చులు చేయకుండా పేదల ఆకలి తీర్చే విధంగా అన్నదానాలు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు. అదేవిధంగా బంజారా కాలనీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన అన్నదానాన్ని గంగవరపు వీరారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వెచ్చ శ్రీనివాసరావు, రామకృష్ణ, బొగ్గవరపు గణేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దాతలు భక్తులు పాల్గొన్నారు.