ఎన్ఆర్ఐ ఫౌండేషన్ (డిఎన్ఎఫ్ ) సేవలు అభినందనీయం -ఖమ్మం జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ కుమార్
ఎన్ఆర్ఐ ఫౌండేషన్ (డిఎన్ఎఫ్ ) సేవలు అభినందనీయం
-ఖమ్మం జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ కుమార్
-దివ్యాంగులకు రూ.3 లక్షల విలువచేసే వీల్ చైర్స్ పంపిణీ
ఖమ్మం, శోధన న్యూస్ : దివ్యాంగులకు , పేద విద్యార్థుల కు , నిరుపేద మహిళల కు డిస్ట్రిక్ట్ ఎన్ఆర్ఐ ఫౌండేషన్(డిఎన్ఎఫ్) వివిధ రకాల సేవల తో వారి జీవితాల్లో వెలుగులు నింపటం అభినందనీయమని ఖమ్మం జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ కుమార్ అన్నారు. కృషిభవన్ రోడ్లోనిడిస్ట్రిక్ట్ ఎన్ఆర్ఐ ఫౌండేషన్ సంస్థ కార్యాలయం గణేష్ బోనాల నిలయం లో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ కుమార్ ముఖ్య అతిధిగా హాజరై 25 మంది దివ్యాంగులకు రూ.3 లక్షల విలువచేసే వీల్ చైర్లను, ఎస్ బిఐటీ లో బీటెక్ చదువుతున్న నిరుపేద విద్యార్థిని కి రూ50 వేల విలువచేసే ఒక లాప్ టాప్ ను పంపిణి చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం తరఫున దివ్యాంగులకు అనేక సేవలను సహాయ కార్యక్రమాలను అందిస్తున్నప్పటికీ డిస్టిక్ ఎన్ఆర్ఐ ఫౌండేషన్ ద్వారా ఇలా దాతలు ముందుకు వచ్చి సహాయం చేయడం వల్ల దివ్యాంగుల జీవితాలకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. ఎన్నారై ఫౌండేషన్ ప్రారంభించిన నాటి నుంచి జిల్లా వాసులైన అనేకమంది ఎన్నారైలు తమ వంతు సాయం అందించడం వల్ల ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం సాధ్యం అవుతుందని ఇలా మాతృభూమి రుణం తీర్చుకునే అవకాశం తమకు దొరుకుతుందని ఎన్నారై ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు బయ్యన బాబురావు అన్నారు . జిల్లా కలెక్టర్ గౌతమ్ కుమార్ సూచన మేరకు ఎన్నో సేవా కార్యక్రమం చేయడానికి మాకు అవకాశం దొరికిందని, ఇంకా సుమారుగా వందమంది దివ్యాంగులకు వీల్ చైర్లు అందించడానికి సిద్ధం చేశామని ఫౌండేషన్ అధ్యక్షలు బోనాల రామకృష్ణ , ఫౌండేషన్ కార్యదర్శి బండి నాగేశ్వరరావు లు పేర్కొన్నారు . ఈ కార్యక్రమంలో 54 డివిజన్ కార్పరేటర్ మిక్కిలినేని మంజుల , మిక్కిలినేని నరేంద్ర చౌదరి , కోశాధికారి పసుమర్తి రంగారావు , కొంగర పురుషోత్తమరావు , కురివెళ్ల ప్రవీణ్ , అన్నం శ్రీనివాసరావు , వాసిరెడ్డి శ్రీనివాస్ , కళ్యాణపు సాంబశివరావు , అంబేద్కర్ కళాశాల ప్రిన్సిపాల్ జ్యోతి , పద్మిని , వాసిరెడ్డి అర్జునరావు , ముదాలగర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు .