కోవిడ్ వేరియంట్ పట్ల అప్రమత్తంగా ఉండాలి -భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక
కోవిడ్ వేరియంట్ పట్ల అప్రమత్తంగా ఉండాలి
-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ : కోవిడ్ వేరియంట్ పట్ల అప్రమత్తంగా ఉండాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా తెలిపారు. గురువారం ఐ డి ఓ సి కార్యాలయంలో ని కలెక్టర్ చాంబర్ లో కోవిడ్ ముందస్తు నియంత్రణ చర్యలపై వైద్యశాఖ అధికారులతో నియంత్రణ చర్యలపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో కోవిడ్ వ్యాప్తి చెందకుండా ప్రజలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో మే నెల నుంచి కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాలేదన్నారు. ఇప్పుడు కొవిడ్ లక్షణాలున్నవారికి పరీక్షలు చేయాలన్నారు. ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రు ల్లో కొవిడ్ బెడ్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కొవిడ్ నియంత్రణకు డ్రగ్స్, ఆక్సిజన్, వెంటిలేటర్లు, పీపీఈ కిట్లు, మాస్క్ లు అందుబాటులో ఉంచాలని సూచించారు. ముక్కోటి ఉత్సవాలకు వచ్చే భక్తులు కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. తప్పనిసరిగా మాస్కులు ధరించాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య అధికారి శిరీష , ప్రధాన ఆసుపత్రి పర్యవేక్షకులు కుమారస్వామి, భద్రాచలం పర్యవేక్షకులు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
