డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ని కలిసిన మెగాస్టార్ చిరంజీవి
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ని కలిసిన మెగాస్టార్ చిరంజీవి
హైదరాబాద్, శోధన న్యూస్:
తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కని గురువారం రాత్రి ప్రజాభవన్ లో ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి-సురేఖ దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ని కాశ్మీర్ నుంచి తెప్పించిన శాలువాతో చిరంజీవి సత్కరించారు. చిరంజీవి దంపతులకు పుష్పగుచ్చం అందించి శాలువా కప్పి భట్టి విక్రమార్క సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం సతీమణి మల్లు నందిని విక్రమార్క, కుమారుడు సూర్య విక్రమాదిత్య ఉన్నారు.