తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

నగదు, బంగారం సీజ్ చేసేటప్పుడు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను పాటించాలి

నగదు, బంగారం సీజ్ చేసేటప్పుడు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను పాటించాలి
-రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్: శాసనసభ ఎన్నికల నేపథ్యంలో నిర్వహిస్తున్న తనిఖీల్లో పట్టుబడే నగదు, బంగారం సీజ్ చేసేటప్పుడు ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, రాష్ట్ర డీజీపీ అంజని కుమార్, ఇతర రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారులతో కలిసి ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై ఫిర్యాదులు, ఎం.సి.ఎం.సి.,నగదు, బంగారం పట్టివేత,సి విజల్ యాప్, తదితర అంశాలపై జిల్లా ఎన్నికల అధికారులతో నిర్వహించిన వీడియో సమావేశంలో ఐడిఓసి కార్యాలయపు మిని సమావేశపు హాలు నుండి జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ప్రియాంక అల, ఎస్పి డాక్టర్ వినీత్, సీజర్ కమిటీ అధికారులు మధుసూదన్ రాజు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగారాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై వచ్చే ఫిర్యాదులను త్వరితగతిన
పరిష్కరించాలన్నారు. రాజకీయ పార్టీల అభ్యర్థుల నుంచి వచ్చే ఫిర్యాదులకు తప్పనిసరిగా తీసుకున్న చర్యలపై ల
సమాధానం అందించాలని సూచించారు.ఎన్నికల ప్రచారానికి సంబంధించిన సమావేశాలు, సభలు నిర్వహించుకునేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధుల, అభ్యర్థుల నుంచి సువిధ సింగిల్ విండో యాప్ ద్వారా, ఆఫ్ లైన్ లో వచ్చే దరఖాస్తులకు సకాలంలో అనుమతులు మంజూరు చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో జరిగే ఎన్నికల ప్రచారంలో వినియోగించే ఆడియో, వీడియోలను ఎం.సి.ఎం.సి. ధృవీకరించాలని, ప్రతి రోజూ ఎం.సి.ఎం.సి.సువిధ యాప్, అఫ్ లైన్ దరఖాస్తులపై ఎన్నికల అధికారి దృష్టి సారించాలన్నారు. ఎన్నికల సమయంలో నిర్వహించే తనిఖీల్లో నగదు, బంగారం సీజ్ చేసే సమయంలో పాటించాల్సిన నిబంధనలపై క్షేత్రస్థాయి అధికారులకు సంపూర్ణ అవగాహన కల్పించాలన్నారు. నగదు సీజ్ చేసే సమయంలో సంబంధిత వ్యక్తులకు సీజ్ చేస్తున్న నగదు, బంగారం వివరాలు, ఎక్కడ అప్పీల్ చేయాల్సి ఉంటుంది అనే అంశాలను తెలియజేస్తూ రశీదు తప్పనిసరిగా అందించాలన్నారు.సీజ్ చేసిన బంగారం, నగదు 10 లక్షల కంటే తక్కువైతే వెంటనే జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ సెల్ కు అప్పగించాలని, 10 లక్షల కంటే ఎక్కువ నగదు సీజ్ చేస్తే ఐటీ అధికారులకు అప్పగించాలన్నారు. సదరు నగదుపై వచ్చే అపీల్ లను సంబంధిత గ్రీవెన్స్ సెల్, ఐటీ అధికారులు పరిశీలించి నిబంధనలు, ఆధారాల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటారన్నారు. ఎన్నికల సమయంలో మనం సీజ్ చేసే నగదు, బంగారం, మధ్యం, ఇతర విలువైన అభరణాల గురించి మీడియాకు సమాచారం అందించాలని, అదే విధంగా సంబంధిత వ్యక్తులు చేసిన అప్పీల్ అనంతరం విడుదల చేసే నగదు వివరాలు సైతం ప్రెస్ కు అందించాలని, దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు నివేదిక నిర్ణిత నమూనాలో సమర్పించాలన్నారు. ఎన్నికల విధులు నిర్వహించే ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు, స్టాటిక్ సర్వేలెన్సు బృందాలు, వీడియో సర్వేలెన్సు బృందాలతో పాటు తప్పనిసరిగా వీడియో కెమెరా సౌకర్యం ఉండాలని, ప్రతి తనీఖీ వీడియో కెమేరాలో రికార్డు చేయాలన్నారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని వల్నరబుల్ పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్ పూర్తి చేయాలని సూచించారు. వల్నరబుల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించే సమయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు అందించే ఫిర్యాదులను సైతం దృష్టిలో ఉంచుకోవా లని పేర్కొన్నారు.
జిల్లాలో ఓటర్ స్లిప్పులు త్వరగా ముద్రించి పంపిణీ చేసే విధంగా కార్యాచరణ రూపొందించుకోవాలని , సామాజిక మాధ్యమాలలో ఎన్నికల నిర్వహణపై వస్తున్న వదంతులు, అపోహలను నివృత్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని, తక్కువ పోలింగ్ నమోదైన పోలింగ్ కేంద్రాలపై అధిక దృష్టి సారించి పోలింగ్ శాతం పెరిగే విధంగా విస్తృతంగా స్వీప్ కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు.వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ప్రియాంక అల మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంగనపై ప్రజలు 1950 కంట్రోల్ నంబర్ కు కానీ, సి విజిల్
యాప్ కు కానీ పిర్యాదు చేయాలన్నారు. ఇప్పటి వరకు కంట్రోల్ నంబర్ కు 698 ఫిర్యాదులు రాగా 697 పరిష్కరించామని, ఒక దరఖాస్తు పెండింగ్ ఉన్నట్లు తెలిపారు. అలాగే సి విజిల్ యాప్ కు 27 పిర్యాదులు రాగా 11 ఫిర్యాదులను పిర్యాదు దారులు రద్దు చేసుకోగా, 16 ఫిర్యాదులు పరిష్కరించినట్లు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *