తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

పోలింగ్ కేంద్రాల్లో అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి

పోలింగ్ కేంద్రాల్లో అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి

– కొత్తగూడెం నియోజకవర్గ సాధారణ ఎన్నికల పరిశీలకులు కమల్ కిషోర్

భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్: ఎన్నికల సంఘ నియమావళి మేరకు పోలింగ్ కేంద్రాల్లో అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గ సాధారణ ఎన్నికల పరిశీలకులు కమల్ కిషోర్ తెలిపారు. సోమవారం కొత్తగూడెం నియోజక వర్గ పరిధిలోని 91 నుండి 99, 153 నుండి 167 పోలింగ్ కేంద్రాల్లో విస్తృత పర్యటనలు నిర్వహించి ఏర్పాట్లు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల కోసం సురక్షిత మంచినీరు, మరుగుదొడ్లు, విద్యుత్, దివ్యాంగులు, వయోవృద్దుల కోసం ర్యాంపులు, దివ్యాంగుల సహాయార్థం వీల్ చైర్లు సిద్ధంగా ఉంచాలని, బూత్ స్థాయి అధికారులను ఆదేశించారు. నూతన ఓటర్లకు ఓటు హక్కు వినియోగంపై సులభంగా అర్థమయ్యే విధంగా ఈవీఎం వినియోగంపై విస్తృత ప్రచారం కల్పించాలని అన్నారు. ఏర్పాట్లు పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ బూతు స్థాయి అధికారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో లైజన్ అధికారి జినుగు మరియన్న, డిటి అంజద్ పాషా తదితరులు, బుతుస్తాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *