తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

పోలీసుల రక్తదాన శిబిరానికి విశేష స్పందన

పోలీసుల రక్తదాన శిబిరానికి విశేష స్పందన

– ఆదర్శంగా నిలిచిన భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్
భద్రాద్రి కొత్తగూడెం,శోధన న్యూస్: ఎంతోమంది పోలీసుల ప్రాణత్యాగాలకు గుర్తుగా అక్టోబర్ 21 న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (ఫ్లాగ్ డే) నిర్వహించడానికి కారణమని భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు.పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (ఫ్లాగ్ డే) పురస్కరించుకుని గురువారం భద్రాచలం ఏరియా ఆసుపత్రి లో భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ అధ్యక్షతన మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది.ముఖ్యఅతిథిగా భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు.భద్రాచలంలో విధులు నిర్వర్తించే పోలీసు అధికారులు,సిబ్బందితో కలిసి స్వయంగా భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ రక్తదానం చేసి సిబ్బందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు.ఈ కార్యక్రమంలో భద్రాచలం పట్టణ వ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్ల నుండి పోలీస్ సిబ్బంది, ప్రజలు,ముఖ్యంగా భద్రాచలం పట్టణ ప్రజలు, యువకులు తదితరులు ఇలా 50 మందికి పైగా పాల్గొని రక్త శిబిరాన్ని విజయవంతం చేశారు.అదేవిధంగా ఏరియా ఆసుపత్రిలో గల రక్తనిధి కేంద్రాన్ని ఆయన పరిశీలించిఎన్ని విధాలుగా రక్తాన్ని శుద్ధి చేస్తారు,రక్తదానం వలన కలిగే ఉపయోగాలు మరియు తదితర అంశాలను ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామకృష్ణ ని అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్ మాట్లాడుతూ ఈ రక్తదాన శిబిరం వల్ల భద్రాచలం నియోజకవర్గంతో ఉన్న తలసేమియా వ్యాధిగ్రస్తులతో పాటు మరికొంత మంది రోగులకు రక్తం అవసరం ఉంటుంది కాబట్టి ఇలాంటి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసిన సమయంలో ప్రజలు ముందుకు వచ్చి రక్తదానం చేయాలని,అలా చేయడం అందరికీ శుభ పరిణామం అని తెలిపారు.రక్తదానం చేసిన వారు ప్రాణదాతలతో సమానమని కొనియాడారు.ఈ రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయడానికి ఎంతగానో సహకరించిన భద్రాచలం ఏరియా ఆసుపత్రి వైద్య సిబ్బంది కి,స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టౌన్ సీఐ నాగరాజు రెడ్డి, టౌన్ ఎస్ఐ లు మధుప్రసాద్, పివీఎన్ రావు, సిబ్బంది, బ్లడ్ ఆర్గనైజేషన్స్ ప్రతినిధులు జిందా, కొప్పుల మురళి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *