పోలీస్ అమరవీరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలి
పోలీస్ అమరవీరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలి
– జిల్లా ఎస్పీ డా వినీత్
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్: దేశ ప్రజల రక్షణ కోసం పోలీసులు చేసే త్యాగం వెల కట్టలేనిదని,ప్రజల ధన మాన ప్రాణాల రక్షణ కోసం పోలీసులు అహర్నిశలు కృషి చేస్తున్నారని,అమరుల త్యాగాలను ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకొవాలని జిల్లా ఎస్పీ డా. వినీత్.జి ఐపిఎస్ అన్నారు. పోలీస్ అమరవీరుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం పోలీస్ ఫ్లాగ్ డే సందర్బంగా జిల్లా ఎస్పీ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో అమరవీరుల స్మారక స్థూపానికి ఘనంగా నివాళులర్పించారు.ముందుగా జిల్లా ఎస్పీ గారు గౌరవ వందనాన్ని స్వీకరించి అమరవీరులకు నివాళులర్పించారు.కార్యక్రమంలో బాగంగా ఈ సంవత్సరం కాలంలో దేశవ్యాప్తoగా అమరులైన 189 మంది పోలీస్ అమరవీరుల పేర్లను జిల్లా అదనపు ఎస్పీ ఆపరేషన్స్ టి.సాయి మనోహర్ చదివి వినిపించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ… 1959 అక్టోబరు 21న పంజాబ్ కు చెందిన 21మంది ఐటిబీపి పోలీసులు సరిహద్దుల్లో చైనా దురాక్రమణకు వ్యతిరేకంగా విధులు నిర్వర్తిస్తుoడగా చైనా రక్షణ బలగాలు సియాచిన్ భూ బాగాన్ని ఆక్రమించెందుకు ప్రయత్నించడంతో హాట్ స్ప్రింగ్ ప్రాంతంలో దీటుగా ఎదురొడ్డి పోరాడరని,ఆ పోరాటంలో పది మంది భారత జవాన్లు ప్రాణాలను కోల్పోయారన్నారు.హాట్ స్ప్రింగ్ అంటే వేడి నీటి బుగ్గ అని అర్థం కాని భారత జవాన్ల రక్తం తో తడిచిన హాట్ స్ప్రింగ్ నెత్తుటి బుగ్గగా మారి పవిత్ర స్థలం గా రూపు దిద్దుకుంని,ప్రతి ఏడాది అన్ని రాష్ట్రాల పోలీసులతో కూడిన బృందం ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించి నివాళులు అర్పించడం ఆనవాయితీ అని అన్నారు. ఇలా ప్రతి సంవత్సరం ఎంతోమంది పోలీసు అమరుల ప్రాణ త్యాగ ఫలితమే నేడు సమాజం స్వేచ్ఛా వాయువులు పీలుస్తూ ప్రశాంతమైన జీవనాన్ని గడుపుతున్నామని అలాంటి వారి త్యాగాలను స్మరించుకోవడం కోసం ప్రతి సంవత్సరం సంస్మరణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.దేశవ్యాప్తంగా ఈ ఏడాది ప్రాణ త్యాగం చేసిన 189 మందిని స్మరిస్తూ వారికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుల తరపున ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నామని అన్నారు. తీవ్రవాదం,ఉగ్రవాదం వంటి విచ్ఛిన్నకర శక్తులు,నేరాలకు పాల్పడే అసాంఘిక శక్తులను అరికట్టి ప్రజల భద్రతకు భరోసా కల్పించడానికి అమరుల త్యాగాలే స్ఫూర్తిగా ప్రజాసేవకు అందరూ పునరంకితం కావాలని ఆకాంక్షించారు.అనంతరం పోలీసు వారి త్యాగాలను స్మరించుకుంటూ పోలీస్ అమరవీరులకు రెండు నిమిషాలు శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, సిబ్బంది అందరూ అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఓఎస్డి టి.సాయి మనోహర్,ఏఆర్ అడిషనల్ ఎస్పీ విజయ్ బాబు,భద్రాచలం ఏఎస్పీ పంకజ్ పరితోష్ ఐపిఎస్,పాల్వంచ డిఎస్పీ వెంకటేష్,కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్, మణుగూరు డిఎస్పీ రాఘవేందర్ రావు,ఇల్లందు డిఎస్పీ రమణ మూర్తి,డీసిఆర్బీ డిఎస్పీ మల్లయ్య స్వామీ,సైబర్ క్రైమ్స్ డిఎస్పీ కృష్ణయ్య ఆర్ఐలు రవి, సుధాకర్,నరసింహారావు,కృష్ణారావు, లాల్ బాబు,నాగేశ్వర రావు మరియు ఇతర సిఐలు,ఎస్సైలు,సిబ్బంది పాల్గొన్నారు.