తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వైద్య శిబిరం

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వైద్య శిబిరం

ఇల్లందు , శోధన న్యూస్ :   ఇల్లందు పట్టణంలోని  ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ (జాతీయ సేవా పథకం) యూనిట్స్ ఆధ్వర్యంలో గురువారం (అర్ బి ఎస్ కే) ప్రభుత్వ వైద్య బృందం వారు విద్యార్థులకు వైద్యశిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్ధులకు చెవి, ముక్కు, గొంతు, చర్మ, కంటి, పుట్టుకతో వచ్చిన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి, పుట్టుకతో లోపాలు వ్యాధులు అభివృద్ధి ఆలస్యం వైకల్యం కోమర ఆరోగ్య సమస్యలతో 18 సంవత్సరాల లోపు పిల్లలకు  డాక్టర్ ఎం. మనోహర్ ( మెడికల్ ఆఫీసర్) డాక్టర్ బి అరుణలు పరీక్షించి మందులు పంపిణీ చేశారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న విద్యార్థులను ఉన్నతస్థాయి వైద్యం చేయించడానికి సిఫార్సు చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ సి హెచ్ భాను ప్రసాద్,  ఎన్ఎస్ఎస్( ఎన్ ఎస్ ఎస్) ప్రొగ్రాం ఆఫీసర్స్ తోర్తి జాన్, విలియం ప్రసాద్, లైబ్రరీయన్ ఎండి. ఖాసిం, ఏఎన్ఎం తార, అధ్యాపక  అధ్యాపకేతర సిబ్బంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *