బారాస మేనిఫెస్టో ప్రజా మేనిఫెస్టో
బారాస మేనిఫెస్టో ప్రజా మేనిఫెస్టో
ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి.
హైదరాబాద్, శోధన న్యూస్:
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బెంగుళూరు నేతలకు గులాములు,బెంగుళూరు నేతలు ఢిల్లీ నేతలకు గులాములు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన బారాస మ్యానిఫెస్టోతో ప్రతిపక్ష పార్టీలకు దిమ్మతిరిగింది అని ఎల్.బి.నగర్ ఎమ్మెల్యే,బారాస పార్టీ అభ్యర్థి శ్రీ.దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు.తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బ్రష్టు పట్టింది అని,నాడు ఢిల్లీకి గులాములగా చెలామణీ అయితే నేడు బెంగళూరు నేతలకు బానిసలుగా మారారని విమర్శించారు.పిసిసి.అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే టిక్కెట్ అమ్ముకుంటు రేటెంత రెడ్డి గా మారాడని ఎద్దేవా చేశారు.ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ..కేసీఆర్ భీమా ప్రతి ఇంటికి ధీమా అని తెలిపారు.బారాస పార్టీ తిరస్కరించిన అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం జరుగుతుంది అని తెలిపారు.టిక్కెట్లు అమ్ముకొని బిఫామ్ ఇస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు.అలాగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టడమే లక్ష్యంగా అడుగు వేస్తుంది భారతీయ రాష్ట్ర సమితి.మరోసారి అధికారంలోకి రావడమే ధ్యేయంగా అ పార్టీ మేనిఫెస్టోను ప్రకటించారు. బీఆర్ఎస్ అధినేత,ముఖ్యమంత్రి కేసీఆర్.ఇప్పటివరకు తెలంగాణ ప్రజల సంక్షేమంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందన్న కేసీఆర్ గత ఎన్నికల్లో ఇవ్వని హామీలను సైతం అమలు చేసిన ఘనత తమదేనన్నారు సీఎం కేసీఆర్ ఇతర రాష్ట్రాలు,ఇతర పార్టీల ఎన్నికల హామీలు,వాటి అమలు తీరుతెన్నులను అధ్యయనం చేసి అన్నివర్గాలను ఆకర్షించేలా హామీలు రూపొందించినట్లు తెలిపారు.2014లో మేనిఫెస్టోను ముందుగానే విడుదల చేసిన గులాబీ పార్టీ 2018లో మాత్రం ఎన్నికలకు మూడురోజుల ముందే విడుదల చేసింది.ఈసారి మాత్రం అసెంబ్లీ ఎన్నికలకు 45 రోజుల ముందే మేనిఫెస్టోను ప్రకటించారు.బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.ఇప్పటివరకు ఇస్తున్న ఆసరా పెన్షన్ ను రూ.5 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. సీఎం కేసీఆర్ అంతేకాదు ప్రతి ఏడాది రూ.500 పెంచుతూ ఐదేళ్ల వరకు రూ.5 వేలు చేస్తామన్నారు.దివ్యాంగుల్లో వెలుగులు నింపేందుకు మరింత చేయూతనివ్వాలని బీఆర్ఎస్ సర్కార్ నిర్ణయించిందన్నారు.దివ్యాంగులకు పింఛను రూ.6వేలకు పెంచుతున్నట్లు కేసీఆర్ ప్రకటించారు.దివ్యాంగుల పింఛను తొలి ఏడాది రూ.5వేలకు పెంచుతామన్నారు.ఇక ప్రతి ఏటా రూ.300ల చొప్పున పెంచుతామన్నారు.అలాగే రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రైతు బీమా తరహాలో కేసీఆర్ బీమా అమలుచేస్తామన్నారు. ఇందుకు కోసం ‘కేసీఆర్ బీమా-ఇంటింటికీ ధీమా’ పథకం తీసుకువస్తున్నట్లు తెలిపారు.దీంతో రాష్ట్రంలోని 93లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు.రూ.5లక్షల బీమాను ఎల్ఐసీ సంస్థ ద్వారా చెల్లిస్తామని తెలిపారు.మహిళల కోసం సరికొత్త పథకాన్ని ప్రకటించారు .సౌభాగ్య లక్ష్మి పథకం కింద అర్హులైన పేద మహిళలకు ప్రతి నెల రూ.3వేలు చొప్పున భృతి చెల్లిస్తామన్నారు.తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు సన్నబియ్యం పథకం అమలు చేస్తామన్నారు. ‘తెలంగాణ అన్నపూర్ణ’ పథకం ద్వారా సన్న బియ్యం అందజేస్తామన్నారు.బీఆర్ఎస్ అధినేత.రైతు బంధు మొత్తాన్ని రూ.16వేలకు దశల వారీగా పెంచుతామన్నారు.తొలి ఏడాది రూ.12వేల వరకు పెంచనున్నట్లు తెలిపారు.ఆ తర్వాత దశలవారీగా పెంపు ఉంటుందని హామీ ఇచ్చారు.పవర్ పాలసీ,అగ్రికల్చర్ పాలసీ తదితర పాలసీలన్నింటినీ యథాతథంగా కొనసాగిస్తామన్నారు.ఇంకా అవసరమైన ఉద్దీపనలు ఏయే రంగాల్లో అవసరమో వాటిని కూడా చేసుకుంటూ ముందుకు సాగుతాం.పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరల నుంచి పేదలకు ఉపశమనం కల్పించేందుకు అర్హులైన పేద కుటుంబాలకు 400 రూపాయలకే సిలిండర్ అందిస్తామని మరో హామీ ఇచ్చారు.ఇక అక్రిడేషన్ ఉన్న ప్రతి జర్నలిస్టులకు రూ.400కే గ్యాస్ సిలిండర్ అందించనున్నట్లు ప్రకటించారు.ఉద్యోగుల తరహాలో కేసీఆర్ ఆరోగ్య రక్ష పేరుతో రూ.15లక్షల వరకు ఆరోగ్య బీమా వర్తింపజేస్తామన్నారు కేసీఆర్ .తెలంగాణలో పటిష్ఠంగా అమలవుతున్న రెసిడెన్షియల్ స్కూల్ వ్యవస్థలోకి అగ్రవర్ణ పేదలకు కూడా అవకాశం కల్పిస్తామని కేసీఆర్ ప్రకటించారు.అగ్రవర్గ పేదల కోసం నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 ప్రత్యేక రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న పాత పెన్షన్ విధానం అధ్యయనం కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు.ఆ నివేదిక ఆధారంగా ఉద్యోగుల పెన్షన్పై నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ హామీ ఇచ్చారు.అసైన్డ్ భూములపై ఉన్న ఆంక్షలు తొలగిస్తామని కేసీఆర్ భరోసా ఇచ్చారు.