మెచ్చా నాగేశ్వర రావు గెలుపు కై డోర్ టూ డోర్ ప్రచారం
మెచ్చా నాగేశ్వర రావు గెలుపు కై డోర్ టూ డోర్ ప్రచారం
-పెళ్ళి కూతురుకు మేనిఫెస్టో ఇచ్చీ ఓటు అడిగిన ఎంపీపీ
-బి ఆర్ ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించాలని విజ్ఞప్తి
అశ్వారావుపేట, శోధన న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజక వర్గం అశ్వారావుపేట గ్రామంలో స్థానిక కోనేటి బజార్, గాందిబొమ్మ సెంటర్, జల్లిపల్లి బజార్ నందు అశ్వరావుపేట నియోజకవర్గం శాసనసభ్యులు, బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మచ్చా నాగేశ్వరరావు , సీఎం కెసిఆర్ గెలుపు కొరకు టౌన్ పార్టి ఆధ్వర్యంలో డోర్ టూ డోర్ ప్రచారం నిర్వహించారు. బిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు బిఆర్ఎస్ మేనిఫెస్టో ను అశ్వారావుపేట ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి వివరిస్తూ కారు గుర్తుపై ఓటు వేయాలని ప్రతీ గడపకు వెళ్ళి ప్రతి ఒక్కరినీ ఓట్లు అడిగారు. ప్రచారం లో భాగంగా పెళ్ళి కూతురుకు మేనిఫెస్టో ఇచ్చి కారు గుర్తుపై ఓటు వేసి బిఅర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించాలని, బిఆర్ఎస్ ప్రభుత్వం గెలిస్తెనే మేనమామ లాగా కేసిఆర్ కళ్యాణ లక్ష్మి పేరుతో లక్ష రూపాయలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వమే నని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల అశ్వారావుపేట ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు సంకా ప్రసాద్, మండల నాయకులు తాడేపల్లి రవి, తాళం సూరి, లింగిసెట్టీ వెంకటేశ్వరరావు, సోమని రమేష్, లింగంకుంట కృష్ణ త్రినాథ్, వెంకటేష్, శివ, శ్రీను, కృష్ణా, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.